వైకాపా ప్రభుత్వం ఏపీకి  భవిష్యత్ లేకుండా చేసింది అని జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం కన్వినర్ మేడా శ్రీనివాస్ అన్నారు. రాజధాని ఉందా లేదా అనే కోణంలో రాజకీయ  కుట్రలకు పోయి అభివృద్ధి లేకుండా చేస్తుంది  అని విమర్శించారు. సేవ్ ఆంధ్ర అనే నినాదంతో 13జిల్లాలో కార్యాచరణ మొదలుపెట్టనున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కమిటీ వేసి ఏపీ ని కాపాడుకుంటామన్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అని ప్రకటించి కేంద్రం చేతులు ఎత్తేసింది అన్నారు.

13జిల్లాలు అభివృధి చెంది మెరుగుపడాలన్నారు. ఏపీ అభివృధి విషయంలోదోచుకున్నోడికి దోచుకున్నంత  అన్నట్లు వైకాపా ముందడుగువేస్తుంది అన్నారు. జై ఆంధ్ర, ఆంధ్రమహాసభ స్పూర్తితో సభలు నిర్వహించి  ఏపీని కాపాడుకుంటామని , కేసీర్ రాజకీయ కుట్రలను ఏపీ మీద పడకుండా కాపాడుకుంటామన్నారు . ప్రధాన లక్ష్యం ఒకటే రాజధాని అది అమరావతన్నారు. వైకాపా ప్రభుత్వం సంక్షేమాలపై కాకుండా అభివృద్ధి వైపు దృష్టి  పెట్టాలని డిమాండ్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: