వైఎస్ జగన్ వద్ద కాకినాడ పంచాయితీ ముగిసింది. బహిరంగ వేదికలపై పరస్పరం  విమర్శలు చేసుకోవద్దని సీఎం జగన్ సూచించారు. ఈ సందర్భంగా ఎంపీ బోస్ మీడియాతో మాట్లాడారు. కాకినాడ మెడలైన్ వంతెన మీద నన్ను.. ద్వారంపూడిని కూర్చొపెట్టి సీఎం మాట్లాడారు అని ఆయన అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ మెడలైన్ వంతెన విషయంలో అవినీతి జరిగింది అని ఆయన పేర్కొన్నారు.

కాకినాడ మెడలైన్ విషయంలో నా అభ్యంతరాలను పరిశీలించేందుకు టెక్నికల్ రిపోర్ట్ తెప్పించమని సీఎం ఆదేశించారు అన్నారు. కాకినాడ డీఆర్సీ విషయంలో జరిగిన గొడవ టీ కప్పులో తుపాను వంటిదే అని ఆయన వ్యాక్ఖ్యానించారు. ఆవేశంలో ఇలాంటి వివాదాలు సహజమే అని ఆయన అన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో తీరు.. నేను ఆవేశపరుడ్ని కాను అని స్పష్టం చేసారు. టిడ్కో ఇళ్లను రూపాయికే ఇల్లు ఇస్తున్నప్పడు అవినీతికి ఆస్కారం లేదు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: