ఎన‌లేని సేవ‌లందించే కొత్త త‌రానికి స్పూర్తి నింపిన నాయ‌కుడు రోష‌య్య‌. ఈరోజు రోశ‌య్య కోల్పోవ‌డం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలోనే ఓ మంచి నేత‌ను కోల్పోయింది. వారి లోటు ఎవ‌రూ తీర్చలేరు అని.. వారి మ‌ర‌ణ వార్త‌ను విన్న వెంట‌నే రాహుల్‌గాంధీ, సోనియాగాంధీల‌తో ఫోన్ లో మాట్లాడించాను. రేపు ఉద‌యం గాంధీ భ‌వ‌న్‌లో 11 గంట‌ల‌కు కార్య‌క‌ర్త‌లు, అభిమానులు సంద‌ర్శించ‌డానికి వీలుగా క‌ల్పిస్తున్నాం.

ఘ‌న‌మైన నివాళుల‌ర్పించేందుకు న‌లుమూలల ఉన్న తెలుగు ప్ర‌జ‌ల‌ను కోరారు. మ‌ర్రిచెన్నారెడ్డి, అంజ‌య్య‌, దామోద‌రం సంజీవ‌య్య‌, వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి వంటి ముఖ్య‌మంత్రుల హ‌యాంలో సేవ‌లు అందించారు రోష‌య్య‌.  ఎలాంటి స‌మ‌స్య‌లు ఎదురైనా కానీ విసుగు చెంద‌కుండా అద్భుతంగా ప‌ని చేసిన వ్య‌క్తి రోశ‌య్య అని కొనియాడారు. కేవ‌లం కాంగ్రెస్ పార్టీ మాత్ర‌మే కాకుండా అన్ని పార్టీల నుంచి మ‌న్న‌న‌లు పొందుతున్న గొప్ప నేత ..వివాదరహితులుగా, నిష్కలింకితులుగా ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి రోశ‌య్య అని గుర్తు చేసారు రేవంత్‌రెడ్డి.


మరింత సమాచారం తెలుసుకోండి: