ఇవాళ 211వరోజు నారా లోకేష్ యువగళం పాదయాత్ర జరగనుంది. పేరూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం అవుతుంది. పేరూరు క్షత్రియ కళ్యాణ మండపం వద్ద ఆక్వా రైతులతో నారా లోకేష్ భేటీ అవుతారు. అమలాపురం హైస్కూలు సెంటర్ లో బిసిలతో సమావేశం అవుతారు. అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ లో చేనేతలతో సమావేశం నారా లోకేష్ అవుతారు. అమలాపురం ముమ్మడివరం గేటు వద్ద దివ్యాంగులతో సమావేశం అవుతుంది. అమలాపురం పుల్లయ్య రామాలయం వద్ద గంగిరెడ్డి సామాజికవర్గీయులతో భేటీ అవుతారు.


అమలాపురం వెంకటేశ్వరస్వామి గుడివద్ద కాపులతో నారా లోకేష్ సమావేశం అవుతారు. భట్నవిల్లిలో ఎస్సీ సామాజికవర్గీయులతో నారా లోకేష్ సమావేశం అవుతారు. భట్నవిల్లిలో యువతతో ముఖాముఖి అవుతారు. సాయంత్రం పాదయాత్ర ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేసిస్తుంది. అనంతవరం సెంటర్ లో స్థానికులతో నారా లోకేష్ సమావేశం అవుతారు. గున్నేపల్లిలో, ముమ్మడివరంలో స్థానికులతో సమావేశం అవుతారు. రాత్రికి ముమ్మడివరం ఉమెన్స్ కాలేజి వద్ద విడిది కేంద్రంలో నారా లోకేష్ బస చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: