సాధారణంగా దాంపత్య బంధం ఎంతో అన్యోన్యంగా ఉండాలి అంటే భార్యాభర్తల మధ్య శారీరక సంబంధం కూడా ఎంతో ముఖ్యమే అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకుని దాంపత్య బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత వధూవరులకు ప్రత్యేకంగా మూడు రాత్రులను ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ మూడు రాత్రులలో మొదటిసారి భార్య భర్తలు శారీరకంగా కలవడం జరుగుతుం.ది పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతో మంది యువత శోభనం రాత్రి ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే పెళ్లి అయిన ప్రతి ఒక్కరికి కూడా తక్కువ సమయంలోనే శోభనం రాత్రి జరుగుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత భార్య భర్తల మధ్య శారీరక సంబంధం అనేది సర్వసాధారణంగా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక్కడ మాత్రం దంపతుల విషయంలో ఇలా జరగలేదు. పెళ్లయి 8 ఏళ్ళు గడుస్తున్నా ఇంకా ఆ దంపతులు శోభనానికి నోచుకోలేదు. అయితే శోభనానికి భార్య సిద్ధంగా ఉన్నప్పటికీ భర్త విరాజ్ మాత్రం ఫస్ట్ నైట్ వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఒక వేళ భార్య ఎప్పుడైనా ఒత్తిడి చేస్తే ఆ సహజ రీతిలో శృంగారం చేసేందుకు ప్రయత్నం చేసేవాడు.


 ఇక భర్త తీరుతో భార్యకు రోజురోజుకు అనుమానం పెరిగిపోవడం మొదలైంది. ఈ క్రమంలోనే ఓ రోజు తన భర్త విరాజ్ గురించి ఆరా తీయగా షాకింగ్ విషయం బయట పడింది. తాను పెళ్లి చేసుకున్న వ్యక్తి మగాడు కాదు మహిళ అన్న విషయం తేలింది. గతంలో లింగమార్పిడి చేసుకునీ పురుషుడు గా మారాడు అన్న విషయం తెలుసుకుని షాక్ అయింది. చివరికి పెళ్లయిన 8 ఏళ్ల తర్వాత భర్త పై గోత్రి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది మహిళ. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉండడం గమనార్హం. స్థానికంగా ఈ ఘటన సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: