సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో కేఎల్ నారాయణ నిర్మాణంలో ఓ మూవీ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ కథను అందించనుండగా ... ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.

ఇకపోతే ఈ సినిమాకు కథను అందించనున్న విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన మొత్తం కథ సిద్ధం అయినట్లు అధికారికంగా ప్రకటించాడు. ఇకపోతే ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను వేగ వంతంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసం మహేష్ , రాజమౌళి , కేఎల్ నారాయణ ముగ్గురు కూడా కొన్ని రోజుల క్రితం దుబాయ్ కి వెళ్లారు. కొంత కాలం అక్కడ ఉండగానే ఆ ప్రాంతంలో అనేక వరదలు రావడంతో తిరిగి వీరు ఇండియాకు వచ్చేశారు. ఇక ప్రస్తుతం ఇండియాలోనే రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పటి నుండి ప్రారంభం అవుతుందా అని దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి కేఎల్ నారాయణ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కి సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కే ఎల్ నారాయణ మాట్లాడుతూ ... మహేష్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ ఈ సంవత్సరం ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: