నందమూరి నట సింహం బాలకృష్ణ కొంత కాలం క్రితం అఖండ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. అఖండ మూవీ కంటే ముందే బాలయ్య , బోయపాటి కాంబో లో సింహా , లెజెండ్ అనే రెండు మూవీలు రూపొంది రెండు కూడా బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించడంతో అఖండ మూవీ కాగానే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీ స్థాయికి వెళ్లిపోయాయి.

ఇకపోతే ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ప్రగ్యా జైస్వాల్ , బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే మొదట ఈ మూవీ యూనిట్ ఏ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ ను కాకుండా మరో హీరోయిన్ అనుకున్నారట. ఆమె ఆ సినిమాను రిజెక్ట్ చేయడంతో ప్రగ్యా ను తీసుకున్నారట. ఇక అఖండ మూవీ లో మొదట అనుకున్న హీరోయిన్ ఎవరు ..? ఆమె ఎందుకు ఆ సినిమాను రిజెక్ట్ చేసింది అనే వివరాలను తెలుసుకుందాం.

అఖండ సినిమాకు సంబంధించిన కథ మొత్తం సెట్ కాగానే ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాలో బాలకృష్ణ సరసన తమన్నా హీరోయిన్ గా అయితే బాగుంటుంది అని ఓ నిర్ణయానికి వచ్చారట. అందులో భాగంగా తమన్నాను కలిసి ఈ మూవీ స్క్రిప్ట్ మొత్తాన్ని వినిపించారట. ఈ సినిమా కథ ఆమెకు బాగానే నచ్చినప్పటికీ ఆ సమయంలో ఇతర మూవీలతో బిజీగా ఉండడం వల్ల నేను ఈ సినిమా చేయలేను అని ఈ బ్యూటీ చెప్పిందట. దానితో ఈ మూవీ యూనిట్ ఏమీ చేయలేక ఆ తర్వాత ప్రగ్యా ఈ సంప్రదించడం , ఆమె ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిందట. అలా మొదట అఖండ మూవీ లో తమన్నాను హీరోయిన్ గా అనుకోగా ఆమె రిజెక్ట్ చేయడంతో ఆ స్థానంలోకి ప్రగ్యా జైస్వాల్ ఎంట్రీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: