ఈ మధ్య కాలంలో సుకుమార్ దగ్గర శిష్యులుగా పని చేసిన వారు ఎంతో మంది డైరెక్టర్ లుగా సూపర్ సక్సెస్ అవుతున్నారు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది డైరెక్టర్లు ఉన్నారు. వారి దగ్గర శిష్యులుగా ఉన్న వారు కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే సుకుమార్ దగ్గర పని చేసి డైరెక్టర్లు అయిన అంత సంఖ్యలో ఎవరి దగ్గర పని చేసిన వారు కూడా లేరు. అలాగే సుకుమార్ దగ్గర పని చేసిన వారు డైరెక్టర్ లుగా మారి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ నీ ను సంపాదించుకున్న వారు అనేక మంది ఉన్నారు. ఇక ఇప్పటి వరకు సుకుమార్ దగ్గర పని చేసి డైరెక్టర్ లుగా సక్సెస్ అయిన వారు ఎవరో తెలుసుకుందాం.

పల్నాటి సూర్య ప్రతాప్ , సుకుమార్ దగ్గర పని చేసి ఆ తర్వాత "కుమారి 21" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకుంది. దానితో తెలుగు సినీ పరిశ్రమలో ఈ దర్శకుడికి మంచి గుర్తింపు లభించింది. ఉప్పెన సినిమాకు దర్శకత్వం వహించినటువంటి బుచ్చిబాబు సన కూడా సుకుమార్ దగ్గర పని చేశాడు. ఈయన కూడా ఈ మూవీ తో మంచి విజయం అందుకొని సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈయన తన తదుపరి మూవీ ని ఏకంగా రామ్ చరణ్ తో చేయనున్నాడు. నాని హీరోగా రూపొందిన దసరా మూవీ దర్శకుడు అయినటువంటి శ్రీకాంత్ ఓదెలా కూడా సుకుమార్ దగ్గరే పని చేసి దర్శకుడుగా మారారు.


ఈయన కూడా దసరా మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇకపోతే విరూపాక్ష మూవీ కి దర్శకత్వం వహించిన కార్తీక్ దండు కూడా సుకుమార్ దగ్గరే పని చేసి ఈ మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు. ఇకపోతే తాజాగా థియేటర్ లలో విడుదల అయిన ప్రసన్న వదనం సినిమా దర్శకుడు అయినటువంటి అర్జున్ వై కె కూడా సుకుమార్ దగ్గరే పని చేశాడు. ఈయన కూడా ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇలా ఇప్పటికే సుకుమార్ దగ్గర పని చేసిన ఐదుగురు వ్యక్తులు దర్శకులుగా మంచి విజయాలను అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: