గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి అయినటు వంటి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రస్తుతం కులాల వారి సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు . ఈయన టీ డీ పీ పార్టీ నుండి ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నాడు . ఇక పోతే ఈయన కేవలం తెలుగు దేశం పార్టీ లో మాత్రమే కాకుండా ఇండియా లోనే మోస్ట్ రిచెస్ట్ పార్లమెంటు అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నాడు. ఇకపోతే తాజాగా పెమ్మసాని కాపు మహిళలు , కార్యకర్తలతో ఓ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో భాగంగా ఈయన మాట్లాడుతూ ... రాజకీయాల్లో  కి నేను వస్తాను అని ఎప్పుడూ అనుకోలేదు . కాకపోతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక హింసాత్మకమైన సంఘటనలు చెలరేగుతున్నాయి . వాటిని ఆపడానికి నేను రాజకీయం లోకి వచ్చాను . వ్యక్తుల మధ్య , వ్యవస్థల మధ్య ఎప్పుడు యుద్ధం జరగలేదు . కానీ నేడు రాజకీయ యుద్ధం మాత్రం చాలా తీవ్రంగా జరుగుతుంది.

ఇక పవన్ కళ్యాణ్ , చిరంజీవి గురించి గతం లో ఎన్నో అసత్య ప్రచారాలను ఎన్నో మీడియా సంస్థలు టెలికాస్ట్ చేశాయి. అలా అసత్య ప్రచారాలు టెలికాస్ట్ అయిన సమయంలో నాకు చాలా బాధ అనిపించింది. పవన్ కళ్యాణ్ ఎంతో నీతి , నిజాయితీ కలిగిన వ్యక్తి. తన చుట్టూ ఉండే ప్రజలకు ఎప్పుడు మంచి చేయాలి అనుకుంటాడు. ఎలాంటి స్వార్థం అతనికి ఉండదు. ప్రజలకు మంచి చేయడం కోసమే రాజకీయాల్లోకి వచ్చారు. ఇలాంటి స్వార్థం లేకుండా పని చేస్తారు కాబట్టే పవన్ కళ్యాణ్ అంటే నాకు ఎంతో ఇష్టం. ఇక నేను కూడా ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజలకు మంచి చేయాలి అనే ఉద్దేశం తోనే రాజకీయాల్లోకి వచ్చినట్లు , నన్ను గెలిపించాలి అని ఆయన తాజా సభలో భాగంగా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp