యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా గోవా బ్యూటీ ఇలియానా , చార్మి హీరోయిన్ లుగా రాఖీ అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో షియాజీ షిండే ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు . కే ఎల్ నారాయణ ఈ మూవీ ని నిర్మించాడు. సిస్టర్ సెంటిమెంట్ ఆధారంగా రూపొందిన ఈ సినిమా విడుదల అయిన సమయంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

భారీ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇక మరి ముఖ్యంగా ఈ సినిమాలోని ఎన్టీఆర్ నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇది ఇలా ఉంటే తాజాగా రాఖీ మూవీ ప్రొడ్యూసర్ అయినటువంటి కే ఎల్ నారాయణ ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో భాగంగా రాఖీ సినిమాలోని ఓ డైలాగ్ ను విని చిరంజీవి ఎలా స్పందించాడు అనే విషయం గురించి చెప్పుకొచ్చాడు. తాజా ఇంటర్వ్యూ లో కే ఎల్ నారాయణ మాట్లాడుతూ ... రాఖీ సినిమా మొత్తం పూర్తి అయింది.

ఆ తర్వాత చిరంజీవి గారికి ప్రివ్యూ వేసి చూపించాం. అందులో భాగంగా ఎన్టీఆర్ కోర్టులో ఓ భారీ డైలాగును చెబుతాడు. అది మొత్తం చూసిన తర్వాత చిరంజీవి ఇలా ఎవ్వరు చెప్పలేరు. ఇది చాలా కష్టం అని అన్నారు అని కే ఎల్ నారాయణ తాజా ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం నారాయణ చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని కే ఎల్ నారాయణ నిర్మించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kln