కావాల్సిన పదార్థాలు:
మటన్ - రెండు కిలోలు
పసుపు - 2 టీ స్పూన్లు
కారం - కిలోన్నర
ఉప్పు - కిలో
నూనె - తగినంత
ఆవపిండి - 10 టీ స్పూన్లు
జీలకర్ర పొడి - 10 టీ స్పూన్లు
మెంతిపిండి - 10 టీ స్పూన్లు
ఆమ్చూర్ పౌడర్- 10 టీ స్పూన్లు
కరివేపాకు - 4 రెబ్బలు
జీలకర్ర - 2 స్పూన్లు
ఆవాలు - 2 స్పూన్లు
ఎండుమిర్చి - 10
వెల్లుల్లి రెబ్బలు - పావుకిలో
తయారీ విధానం:
ముందుగా మటన్ను ముక్కలుగా కోసి శుభ్రంగా కడగాలి. తర్వాత ఉప్పు, పసుపు వేసి ఉడికించి కాసేపు ఎండబెట్టాలి. తర్వాత వాటిని నూనెలో వేయించాలి. చల్లారాక మెంతిపిండి, ఆవపిండి, కారం, జీలకర్రపొడి, ఆమ్చూర్ పౌడర్ వేసి బాగా కలపాలి. కొద్దిగా నూనె వేడిచేసి కరివేపాకు, ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలతో తాలింపు పెట్టాలి.
ఈ తాలింపును మటన్ ముక్కల్లో వేసి కలిపి, వేడి చల్లారాక, మూత బిగుతుగా ఉండే జాడీలో ఉంచాలి. పచ్చడి మొత్తం మునిగేవరకూ నూనె పోసి మూత పెట్టెయ్యాలి. మూడు, నాలుగు రోజులు ఊరితే సరిపోతుంది. రైస్లో దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది.