ఓపక్క కరొనతో జనమంతా కొట్టుమిట్టాడుతుంటే కామాంధులకు ఇదే సదావకాశంగా మారింది. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలంలోని ఓ గ్రామంలో శనివారం రాత్రి మైనర్ బలికైనా 9 ఏళ్ళ బాలిక పై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ గ్రామానికి చెందిన బాలింత తల్లి తండ్రి పనిమీద పక్కనున్న గ్రామానికి వారి కుమార్తెను ఒంటరి గా వదిలి వెళ్లారు . ఆ బాలికపై యువకుడు ఎన్నోరోజులుగా కెన్నెసీ ఉంచాడు.

 

కాలం కలసిరావడం తో ఆ యువకుడు ఆ ఇంట్లోకి చొరబడి బెదిరించాడు. చెప్పినట్లు వినకపోతే తన ఫోటోలు సోషల్ మీడియా లో పెడతానంటూ బెదిరించాడు. భయపడిన ఆ బాలిక ఆ యువకుడు చెప్పినట్లు డాబాపైకి వెళ్ళింది. ఆయువకుడు ఆమెను బలాత్కరించే సమయంలో ఆమె జననాగాలలో చీలిక ఏర్పడి ఎక్కువ రక్త స్రావం జరగడంతో ఆ బాలిక బాధతో అరవసాగింది . అరుపులు విన్న పొరుగు వాళ్ళు అక్కడకు చేరి ఆ సంఘటనను చూసి నిర్ఘాంతపోయారు . వెంటనే ఆ యువకుడికి (18 ) దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న అతడి కోసం గాలిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: