ప్రతిరోజూ వ్యాయామం చేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చు అని వైద్యులు చెబుతుంటారు. ఇక ఎంత సమయం లేక పోయినా కాసేపు వాకింగ్ చేస్తే రోజంతా ఉల్లాసంగా ఉండవచ్చు అని అంటూ ఉంటారు. ఈ క్రమంలోనే డాక్టర్ల సూచనల మేరకు ఎంతో మంది ఉదయాన్నే వాకింగ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఓ యువకుడు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి  వాకింగ్ చేయడానికి వెళ్ళాడు. కానీ అటు నుంచి అటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు సదరు యువకుడు. అనుకోని ఘటనల కారణంగా చివరికి ప్రాణాలు కోల్పోయాడు ఆ యువకుడు. ఇక ఈ విషాదకర ఘటన తో అతని కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది అని చెప్పాలి.


 ఇక ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత అటు మనిషి జీవితం దేవుడి చేతిలో కీలుబొమ్మ లాంటిది అని అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలో అనుకోని ఘటనలు చివరికి  విషాదాన్ని నింపుతూ ఉంటాయి. అతను రోజు లాగానే వాకింగ్ కు వెళుతూ ఉన్నాడు కానీ ఊహించని ఘటన. అటువైపుగా వేగంగా వచ్చిన ఒక బైక్ అతని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా ఎగిరి పడ్డాడు సదరు యువకుడు. తీవ్రగాయాలు అయ్యాయి. ఇక వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ లో చోటుచేసుకుంది.


 యాదగిరి అనే 34 ఏళ్ల వ్యక్తి ఉదయం సమయంలో స్నేహితులతో కలిసి వాకింగ్ చేయడానికి వెళ్ళాడు. కానీ అక్కడే ఒక వాహనం రూపంలో మృత్యువు తన కోసం వేచి చూస్తోంది అన్న విషయాన్ని మాత్రం గ్రహించలేక పోయాడు. ఇలా రోడ్డుపై వాకింగ్ చేస్తున్న సమయంలో అటువైపుగా వేగంగా దూసుకొచ్చిన శ్రీ ద్విచక్ర వాహనం అతన్ని ఢీకొట్టింది. అయితే ఇక ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స  చేసిన   వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ మృతి చెందాడు యాదగిరి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: