వైసీపీతో జనసేన యుద్ధానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన కార్యకర్తలు, వైసీపీ నేతల మధ్య సోషల్ మీడియాలో వార్ కొనసాగుతోంది. పేదలకు పెత్తందారులకు మధ్య జరిగే యుద్ధం అని వైసీపీ ఫ్లెక్సీలు పెడుతోంది. దీనిపై జనసేన కార్యకర్తలు నిరసన తెలిపిందేకు సిద్ధమవుతున్నారు. ఇవి కించపరిచేలా ఉన్నాయి. వీటిని తొలగించాలని జనసేన కోరుతోంది. పశ్చిమ గోదావరి, గుంటూరు, విశాఖ, ప్రకాశం జిల్లాలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో ఆదివారం కొన్ని ఫ్లెక్సీలు వెలిశాాయి.


ముఖ్యమంత్రి జగన్ మోకాళ్లపై కూర్చొని పేదల కోసం పెత్తందారులతో పోరాడుతున్నట్లు ఫ్లెక్సీల్లో ఉంది.  పల్లకీ మీద చంద్రబాబు, లోకేశ్ ఉండగా, ఆ పల్లకీని మోస్తున్నట్లు పవన్ కల్యాణ్ ఉన్న ఫ్లెక్సీని పెట్టారు. దీంతో జనసేన కార్యకర్తలకు చిర్రెత్తు కొచ్చింది.  24 గంటల లోపు ఈ ఫ్లెక్సీలను తొలగించాలని జనసేన కార్యకర్తలు డిమాండ్ చేశారు. తాము కూడా జగన్ గురించి ఇలాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని  హెచ్చరించారు. గుంటూరు జిల్లా తెనాలి లో జనసేన నేతలు మాట్లాడుతూ..  ఎవరైతే ప్లెక్సీలు పెట్టారో వారితోనే  వెంటనే తీసేయించాలని పోలీసులను కోరారు. లేకపోతే మేం కూడా అలాంటి ఫ్లెక్సీలే పెడతామని పోలీసులతో చెప్పారు.


మరో వైపు వైసీపీ కి వ్యతిరేకంగా విశాఖ నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. దీన్ని రాత్రికి రాత్రే ఎవరో తొలగించారు. జనసేన, టీడీపీ కార్యకర్తలు సత్యం కూడలిలో ధర్నాకు దిగారు. జన సేన అధినేత పవన్ కల్యాణ్  ఒక పోస్టు చేశారు. జగన్ ను అధికారులు, పార్టీ నాయకులు పల్లకిలో ఊరేగిస్తున్నట్లు ఒక కార్టూను పోస్టు చేశారు. కొత్త దేవుడు, కొంగొత్త దేవుడు అని రాస్తూనే దానిపైన హెలిక్యాప్టర్లో సంచుల్లో డబ్బులు తీసుకెళ్లిపోతున్నట్లు ఉంది. అంతే కాకుండా నియంతలతో యుద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పవన్ రాసుకొచ్చారు. దీంతో జగన్, పవన్ కల్యాణ్ మధ్య రాజకీయ శత్రుత్వం మరింత పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: