జనవరి 20 నుండి 21 వరకు ఇన్ఫినిటీ ఐటీ సమ్మిట్ జరుగుతుంది. ఇక్కడ దీనికోసం ఐటీ నిపుణులు అందరూ సమావేశం కాబోతున్నారు. ఐటిఏఏపీ ద్వారా నిర్వహించబడే ఈ సమావేశానికి ఎస్.టీ.పీ.ఐ, ఐటీఈ&సీ , ఏపీఐఎస్ ఇన్ఫినిటీ- వైజాగ్ ఇంకా ఏ.పీ ప్రభుత్వం సహఆతిథ్యాన్ని అందించబోతుండటం విశేషం. ఈ ఐటీ సమ్మిట్ ద్వారా అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తులు, పరిశోధకులు, కన్సల్టెంట్లు, విద్యావేత్తలు, నిపుణులు ఇంకా ఇతర వాటాదారులు ఒకచోట కలిసే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 3 - 4 తేదీలలో జీ-20 సమావేశాలు నిర్వహిస్తారు. 2023 ఫిబ్రవరి 3 , 4 న వైజాగ్లో, వ్యవసాయం, విద్య, ఆర్థికరంగం, పర్యావరణం ఇంకా ఆరోగ్యంపై 37 సెమినార్లు భారీ ఎత్తున నిర్వహిస్తారు. ఫిబ్రవరి 16 - 17 తేదీల్లో గ్లోబల్ టెక్ సమ్మిట్ ఉంటుంది. ఇది మరో కీలకమైన కార్యక్రమం. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ నిపుణులు మరియు ఐటీ సంస్థల యజమానులు అందరూ రాబోతున్నారు.
మార్చి 3-4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహిస్తారు. ఈ సమావేశానికి అనేకమంది పెట్టుబడుదారులు వచ్చి అక్కడ పరిస్థితులను చూసి పెట్టుబడులు పెట్టబోతున్నారు. ఏప్రిల్ 24వ తేదీన తిరిగి జీ-20 సమావేశాలు జరుగుతాయి. దీనిలో పాల్గొనడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న 85% ఆదాయం కలిగిన 190 దేశాల యొక్క వివిధ ప్రాంతాలకు సంబంధించిన ప్రతినిధులు అక్కడికి రాబోతున్నారు.