
దీంతో ఇప్పటికే టిడిపిలో టచ్ లో ఉన్న వారిపై జగన్ ఫోన్ టాపింగ్ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో భూమా అఖిలప్రియ చేసిన ఆరోపణలపై వైసీపీ నిజంగానే స్పందిస్తుందో లేదో చూడాలి. కానీ అంతకు ముందు ఈ ఆరోపణలు చేయడం వల్ల ఆయన ఒకవేళ టీడీపీలోకి వెళ్తే వైసీపీలోకి అఖిలప్రియ వెళ్ళేందుకు రూటు క్లియర్ అవుతుందని అనుకోవచ్చు. అఖిలప్రియ మైండ్ గేమ్ స్టార్ట్ చేసిందని అందరూ అనుకుంటున్నారు.
వచ్చే ఏడాది ఎన్నికలు ఉంటాయి. కాబట్టి ఇప్పటినుంచి గెలుపు బాట పట్టాలని ఆమె ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు ఈ కామెంట్ల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా మొన్నటి వరకు హైదరాబాదులో బిజినెస్ చేసుకున్న అఖిలప్రియ ప్రస్తుతం మళ్లీ రాజకీయాల్లో చురుకుగా ఉంటుంది. ముఖ్యంగా నంద్యాలలో శిల్పా రవితో నువ్వా నేనా అన్నట్టు పోటీ కొనసాగేలా ఉంది.
ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి నంద్యాల నియోజక వర్గంలో ఓడిపోవడం అనేది కాస్త ఇబ్బంది కలిగించే విషయం. దాని నుంచి బయటకు రావడానికి ప్రస్తుతం ప్రయత్నిస్తోంది. ఒకవేళ వైసీపీ టిడిపి వీరిద్దరి మధ్య జరుగుతున్నటువంటి మాటల దాడిని నిశితంగా గమనిస్తూనే ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదనేది అవి తేల్చుతాయి. అప్పటివరకు వీరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది.