సినిమాలు చేసినా చేయకపోయినా సరే కొంతమంది వార్తల్లో ఉంటూ కాస్త హడావుడి పడుతూ ఉంటారు. అందులో ప్రధానంగా స్టార్ హీరోయిన్ నయనతార గురించి ఎక్కువగా వార్తలు మనం వింటూనే ఉంటాము అనే మాట వాస్తవం. నయనతార ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తుండగా కన్నడలో ఒక సినిమా తమిళంలో రెండు సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు. వయసు పైబడినా సరే నయనతార విషయంలో కొంత మంది అగ్ర హీరోలు అలాగే కొంతమంది దర్శక నిర్మాతలు ఆమె వెంట పడటం ఆసక్తిని రేపే అంశంగా చెప్పాలి.

ప్రస్తుతం నయనతార పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారని తమిళ దర్శకుడితో పెళ్లి చేసుకోవడానికి రెడీ గా ఉన్నారని ప్రచారం కూడా జరిగిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు ఆమె కు సంబంధించి కొన్ని వార్తలు టాలీవుడ్ వర్గాల్లో బాగా హడావుడి అవుతున్నాయి. నందమూరి బాలకృష్ణ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన తర్వాత సినిమా విషయంలో నయనతార ఆసక్తి చూపించారని ఆ సినిమాలో నటించడానికి ఆమె సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. ఆ సినిమాలో ఆమె పాత్ర పోలీస్ గా ఉంటుందని కూడా టాలీవుడ్ వర్గాల మాట.

ఆ సినిమాను పూరి జగన్నాథ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న నేపథ్యంలో పూరి జగన్నాథ్ పై ఉన్న నమ్మకంతో నయనతార సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. గతంలో బాలకృష్ణతో ఆమె సినిమా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు నయనతార కు సంబంధించి మరో వార్త కూడా టాలీవుడ్ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. నయనతారకు ప్రభుదేవా ఫోన్ చేశాడని ఒక సినిమాకు సంబంధించి వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయని అంటున్నారు. గతంలో వీరిద్దరూ ప్రేమలో ఉండి పెళ్లి వరకు వెళ్లి ఆ తరువాత విడిపోయారు. అయినా సరే ఆమె విషయంలో ప్రభుదేవా చాలా సానుకూలంగా ఉన్నాడని తర్వాత దర్శకత్వం వహించే సినిమాలో కీలక పాత్ర ఇచ్చాడు అని కూడా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: