తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు కలిగిన నిర్మాణ సంస్థలలో ఒకటి అయినటువంటి పీపుల్స్ మీడియా సంస్థ ప్రస్తుతం వరస సినిమాలను నిర్మిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ప్రస్తుతం ఈ నిర్మాణ సంస్థ ఎక్కువ శాతం విజయాలను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుంది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ నిర్మాణ సంస్థ నిఖిల్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చందు మండేటి దర్శకత్వంలో రూపొందిన కార్తికేయ 2 మూవీ ని నిర్మించింది.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం మాత్రమే కాకుండా అద్భుతమైన కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ 100 కోట్లకు పైగా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి ... పోయిన సంవత్సరం బ్లాక్ బస్టర్ మూవీ ల లిస్ట్ లో చేరిపోయింది. ఇలా కార్తికేయ 2 మూవీ తో పోయిన సంవత్సరం అద్భుతమైన విజయం అందుకున్న ఈ నిర్మాణ సంస్థ పోయిన సంవత్సరం డిసెంబర్ 23 వ తేదీన విడుదల అయిన ధమాకా మూవీ ని కూడా నిర్మించింది.

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ కి త్రినాధ్ రావు నక్కిన దర్శకత్వం వహించగా ... శ్రీ లీల ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని తాజాగా 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా పీపుల్స్ మీడియా సంస్థ పోయిన సంవత్సరం నిర్మించిన కార్తికేయ 2 మరియు ధమాకా మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: