గత కొన్ని సంవత్సరాలుగా డబ్బు పొదుపుపై ప్రజలలో చాలా అవగాహన వచ్చింది. ముఖ్యంగా గత కొన్ని ఏళ్లుగా ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోతుంది కాబట్టి ఆర్థిక ప్రణాళిక విషయంలో ప్రజలు జాగ్రత్త పడుతున్నారని చెప్పవచ్చు. పెళ్లి, పిల్లల భవిష్యత్తు , పదవి విరమణ ఇలా ప్రతిదానికి కూడా ఆర్థిక ప్రణాళిక గురించి ముందుగానే ఆలోచిస్తే భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావు. మీరు కూడా మీ పిల్లల భవిష్యత్తు కోసం వారి భద్రత కోసం ఉన్నత చదువుల నుండి పెళ్లి వరకు ఎలాంటి టెన్షన్ లేకుండా వారి బాధ్యతలు నిర్వహించాలి అంటే ఇప్పటి నుంచే ఆర్థిక ప్రణాళిక ప్రారంభించడం తప్పనిసరి.

మీరు మీ బిడ్డ పుట్టిన రోజు నుంచే ప్రతి నెల రూ.5000 రూపాయలను కేటాయించగలిగితే ఖచ్చితంగా 20 సంవత్సరాల లో ఆమె కోసం రూ.50 లక్షల నిధిని మీరు సులభంగా దాచి పెట్టవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. అదే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఈరోజుల్లో సాధారణ ప్రజల్లో కూడా ఈ పథకం బాగా పాపులారిటీ దక్కించుకుంది మార్కెట్తో ముడిపడి ఉండడం వల్ల ఫిక్స్డ్ వడ్డీ రేట్లు హామీ ఇవ్వలేవని గమనించాలి. అయితే నేరుగా మార్కెట్లో డబ్బు పెట్టుబడి పెట్టడం కంటే ఇందులో తక్కువ ఇస్తూ ఉంటుంది.

ఇందులో పెట్టుబడి పెట్టడం వల్ల 12 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ప్రతి నెల రూ.5000 పెట్టుబడితో 20 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేస్తే 20 సంవత్సరాలు లో మీ మొత్తం పెట్టుబడి రూ.12,00,000.. అయితే 12 శాతం వడ్డీ లభిస్తుంది కాబట్టి పెట్టుబడి మొత్తం పై మీరు రూ.37,95,740 వరకు వడ్డీ పొందవచ్చు.  ఇలా చేస్తే 20 సంవత్సరాల లో పెట్టుబడి మొత్తం వడ్డీతో కలిపి రూ.49,95,740 మీ చేతికి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి పథకాలు పిల్లల భవిష్యత్తుకు పూర్తి భద్రతను అందిస్తాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: