ఇప్పుడు సినిమాలు ఊహల వెంట పరుగుతు తీయడం మాని వాస్తవాలను ఆవిష్కరిస్తున్నాయి. నిజజీవిత గాధలు వెండితెరపై దూసుకొస్తున్నాయి. అసలైన నిజాన్ని సరిగ్గా ఆవిష్కరించగలిగితే హిట్ కొట్టినట్టే.. ఈ విషయాన్ని ఇప్పటికే అనేక బయోపిక్లు నిరూపించాయి.
అలాంటి మరో బయోపిక్లో బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంకా చోప్రా నటిస్తోందట. ముంబయికి చెందిన రౌడీరాణి గుంగూబాయి కోఠేవాలి జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుందట. డైరెక్టర్ ఎవరో తెలుసా.. సంజయ్ లీలా భన్సాలీ.
ముంబైలోని కామటిపుర రెడ్ లైట్ ఏరియా బ్యాక్ డ్రాప్లో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుందట. ప్రియాంక చోప్రా వేశ్యావాటిక నిర్వాహకురాలు గుంగూబాయిగా నటించబోతుంది. కామాటిపుర ప్రాంతానికి చెందిన గంగూబాయి అంటే అక్కడివారు వణికిపోయేవారట.
చిన్నతనంలో తనకు తెలియకుండా వ్యభిచార కూపంలో కూరుకు పోయిన గంగూబాయి తర్వాత రౌడీరాణిగా ఎదిగింది. ముంబాయిలో ఆమె నడిపిన వ్యభిచార గృహాల గురించి ఈ మూవీలో చూపించబోతున్నారు. వాస్తవం ఒకటి..జనం మనసుల్లో ఉండేది మరొకటి అన్న వాస్తవాన్ని ఈ సినిమాలో హైలెట్ చేయబోతున్నారట.