టాలీవుడ్ పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని  నటి శ్రీరెడ్డి టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో మహిళలకు జరుగుతున్న అన్యాయం పై పోరాటం చేస్తున్నా అంటూ శ్రీరెడ్డి  చేసిన నిరసనకు పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించకపోవడంతో ఇక అప్పటి నుండి మొదలు పెట్టింది శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం. పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నే ఉంది శ్రీ రెడ్డి. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మీద సంచలన వ్యాఖ్యలు చేస్తూ విషం కక్కుతూనే ఉంది . ఇక ఆ తర్వాత పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆయన ప్రతిష్టను దిగజార్చే విధంగా ఎన్నో సంచలన కామెంట్స్ చేసింది శ్రీ రెడ్డి. 

 

 

 

 

 

 ఇక శ్రీ రెడ్డి  సోషల్ మీడియాలో బాగా పాపులర్ కావడంతో శ్రీ రెడ్డి ఏం చేసినా అది నిమిషాల్లో వైరల్ గా  మారిపోయేది. అయితే మొన్నటి వరకు కాస్త సైలెంట్ అయిన శ్రీ రెడ్డి... ఇప్పుడు మళ్ళి పవన్ కళ్యాణ్ పై విషం కక్కడం మొదలుపెట్టింది. తాజాగా జనసేన పార్టీ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది శ్రీ రెడ్డి. జనసేన పార్టీని అమ్మేస్తున్నారట కదా అని శ్రీరెడ్డి పెట్టిన పోస్ట్ సంచలనం రేపింది. మీ అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఆ పార్టీని కాంగ్రెస్ లో  విలీనం చేసినట్టే... జనసేన పార్టీని కూడా అమ్మేస్తున్నారట కదా అంటూ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.కాగా  శ్రీ రెడ్డి పెట్టిన పోస్ట్ నిమిషాల్లో సంచలనంగా మారింది. 

 

 

 

 

 అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరో సారి  సంచలన కామెంట్స్  చేసింది శ్రీ రెడ్డి. తాజాగా  చిరంజీవి సినీ కెరియర్ లోనే మొట్టమొదటి చారిత్రాత్మక సినిమాగా  విడుదలైన చిత్రం సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రం చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే సైరా సినిమాపై కామెంట్ చేసిన శ్రీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా ను మెచ్చుకుంది శ్రీ రెడ్డి. చిరంజీవి నటించారు కాబట్టి సైరా నరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ అయిందని.... ఒకవేళ పవన్ కళ్యాణ్  ఈ సినిమా చేసుంటే అట్టర్ ఫ్లాప్ అయి ఉండేదని శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తో తనకు ఒక సినిమా తీయాలని ఉందని. ఏదైనా దయ్యం సినిమా తీస్తే బెటర్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: