నయనతార కోలీవుడ్ టాప్ హీరోయిన్. అంతేకాదు
టాలీవుడ్ లో కూడా
మెగాస్టార్,
వెంకటేష్,
నాగార్జున,
బాలకృష్ణ ల కి బెస్ట్ అండ్ బెటర్ ఛాయిస్. అందుకే రీసెంట్గా
సైరా నరసింహా రెడ్డి సినిమాలో నయన్ ని సెలెక్ట్ చేసుకున్నారు. ఇక నయన్ అటు
టాలీవుడ్, ఇటు
కోలీవుడ్ లో లేడి
సూపర్ స్టార్ అన్న విషయం ఎవరూ కాదనలేని సత్యం. స్టార్ హీరోలకే కాదు, కుర్ర హీరోలకు
నయనతార క్రేజీ హీరోయిన్. అందుకే ఆమెకి అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఎంత పారితోషకం ఇచ్చినా ఏం లాభం. తన క్రేజ్తో సినిమాలలో నటిస్తుంది కానీ ప్రమోషన్స్కి రాదు. దర్శక, నిర్మాతలకు ఈ విషయంలో ఎంత కోపం ఉన్నప్పటికీ...
నయనతార క్రేజ్ వలన అంత దిగమింగుకుంటున్నారు.
అయితే తాజాగా ఆమెకి క్రేజ్ ఉంటే ఉండనివ్వండి.. ఇప్పటి నుండి
టాలీవుడ్ దర్శక, నిర్మాతలు
నయనతార విషయంలో కాస్త క్లారిటీకి వచ్చారు. ఎవరు లేకపోతే
నయనతార తప్ప లేకపోతే నయన్ ని కాస్త దూరం పెట్టాలనే ఆలోచనకి వచ్చారట. ఎందుకంటే
సైరా వంటి భారీ
సినిమా,
మెగాస్టార్ హీరోయినప్పటికి..రాం
చరణ్ రిక్వెస్ట్ చేసినా కూడా
సైరా ప్రమోషన్స్ కి రాకుండా చిత్ర యూనిట్ ని ఇబ్బంది పెట్టింది. అదేంటి అంటే ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ ని చెప్పి తప్పించుకుంది. ప్రస్తుతం కోలీవుడ్లో స్టార్ హీరోలతో నటిస్తున్న నయనతారకి
కోలీవుడ్ దర్శక, నిర్మాతలు కూడా షాకిచ్చేలా కనబడుతుంది వ్యవహారం. అదే ఆమె పబ్లిసిటీకి దూరంగా ఉంటే.. ఆమెకి అవకాశాలు దూరం అంటూ ఓ మాట మీద కొచ్చేలా
కోలీవుడ్ దర్శక, నిర్మాతలు ఉన్నట్టుగా టాక్.
నయనతార.. తను పెట్టే కండిషన్, పబ్లిసిటీ విషయంలో తీరు మార్చుకోకపోతే తామే తమ తీరు మార్చుకుంటామని నయనతారకి తెలిసేలా చేసేట్టుగా కనబడుతున్నారు. ఇక నుంచి ఆమె స్థానంలో మరో పేరున్న హీరోయిన్ని తీసుకుని ఆమెకి షాక్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టుగా
కోలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఎందుకంటే
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ నటించిన 'దర్బార్' ప్రమోషన్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఏ.ఆర్.మురగదాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే
రజనీ కాంత్, మురగదాస్ అడిగినా కూడా ప్రమోషన్స్ కి నో అని నిర్మొహమాటంగా చెప్పిందని సమాచారం. అందుకే
కోలీవుడ్ దర్శక, నిర్మాతలు నయన్ విషయంలో ఈ నిర్ణయానికొచ్చారట. దీన్ని బట్టి చూస్తే ఇక
సౌత్ సినిమా ఇండస్ట్రీలో నయన చాప్టర్ క్లోజ్ అని తెలుస్తోంది.