భూమికా చావ్లా.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈ తరం వాళ్లకు ఏమో కానీ.. మిలినియం మొదట్లో ఉన్నోళ్లను మాత్రం తన అందాలతో "ఖుషీ" చేయించింది భూమికా చావ్లా. తెలుగులో నటించింది తక్కువ సినిమాలే అయినా కూడా ఇండస్ట్రీ హిట్స్ హీరోయిన్గా భూమికకు పేరుంది. "ఖుషీ"తో పాటు "సింహాద్రి" కూడా ఈమెకు సూపర్ క్రేజ్ తీసుకొచ్చాయి. బాంబే నుంచి వచ్చిన ముద్దుగుమ్మ కావడంతో అందాల ఆరబోతలో కూడా పెద్దగా ఏ కంప్లైంట్స్ లేకుండానే కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది భూమిక. తెలుగు చిత్రం యువకుడు (2000) తో సినీరంగ ప్రవేశం చేసింది, అప్పటినుండి వివిధ భారతీయ చిత్ర పరిశ్రమలలో పనిచేసింది మరియు తెలుగు, తమిళం, హిందీ, భోజ్ పురి, పంజాబీ మరియు మలయాళ భాషలలో ముప్పైకి పైగా చిత్రాలలో నటించింది.
అక్కినేని హీరో సుమంత్ కథానాయకుడుగా నటించిన యువకుడు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది నటి భూమిక చావ్లా.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఖుషి, మహేష్ బాబు ఒక్కడు, ఎన్టీఆర్ సింహాద్రి సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తరవాత నటించిన సినిమాలు పెద్దగా విజయాన్ని సాధించలేకపోయాయి. ఇక శివాజీ హీరోగా వచ్చిన మిస్సమ్మ సినిమాకి గాను నంది అవార్డుని దక్కించుకుంది. ఇక 2007 లో వివాహం చేసుకొని సినిమాలకి దూరంగా ఉన్న భూమిక మళ్లీ లడ్డుబాబు సినిమాతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఎంసిఎ, యు టర్న్, సవ్యసాచి, రూలర్ సినిమాల్లో నటించింది. అయితే ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఉంది.
పవన్ ఖుషి , మహేష్ ఒక్కడు , ఎన్టీఆర్ సింహాద్రి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది భూమిక. ఈ సినిమాలు ఆ హీరోలో కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఎంటటే ఈ ముగ్గురు హీరోలకు అవి ఏడోవ చిత్రం కావడం విశేషం. అయితే ఈ భామ ఇప్పటికీ తను గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్ధంగానే ఉన్నానని చెబుతుంది భూమిక. ఈమె అడగడం వరకు బాగానే ఉంది కానీ ఈమెను గ్లామర్ షో చేయించే ఆలోచన ఇప్పుడు ఏ దర్శకుడు చేస్తాడు అనేది అసలు ప్రశ్న.