ఈ మద్య స్టార్ హీరోలు నటిస్తున్న మూవీస్ థియేటర్లోకి వచ్చే ముందు నానా హంగామాలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రమోషన్ విషయంలో రక రకాల పద్దతులు ఫాలో అవుతున్నారు. కొంత మంది సినీ తారలైతే ఏకంగా తమ మూవీస్ కోసం ఆడియన్స్ వద్దకు వెళ్లి రక రకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. మరికొంత మంది ముఖ్యమైన ఛానల్స్ లో చిట్ చాట్ తో అదరగొడుతున్నారు. అనీల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన జంటగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ రేపు గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఆర్మీ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ సినిమాపైన మంచి అంచనాలను పెంచేసాయి.
ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లు ఊపందుకున్నాయి. తాజాగా ఈ మూవీ మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. మేకింగ్ వీడియోలో చిత్ర సెట్స్తో పాటుగా సినిమాలోని కొన్ని సన్నివేశాల మేకింగ్ను చూపించారు. కొండారెడ్డి బురుజు, ట్రైన్ సీన్స్ లాంటివి ఈ వీడియోలో చూపించారు. ముఖ్యంగా ఇవే మూవీకి ప్రధాన ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తున్నాయి. ఈ మేకింగ్ వీడియో చూస్తుంటే నిజంగా కన్నుల పండువగా అనిపిస్తుంది.. మొదటి నుంచి ఎండ్ వరకు సినిమాల్లో నటించిన వారు.. టెక్నికల్ టీమ్ అందరూ సంతోషంతో నవ్వుతున్న సమయంలో చిత్రీకరించినట్లు కనిపిస్తుంది.
ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తుంది. రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్ ,రావు రమేష్, సంగీత, బండ్ల గణేష్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాని దిల్ రాజు , అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు ఈ సినిమాని నిర్మించాడు. ఈ సినిమాతో పాటు సంక్రాంతి బరిలో రజినీకాంత్ దర్బార్, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు , కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమాలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.