తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా పరిచయం అయిన మహేష్ బాబు ఇప్పుడు నెంబర్ వన్ పొజీషన్లో వరుస విజయాలతో దుమ్మురేపుతున్నారు. శ్రీమంతుడు చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న మహేష్ బాబు తర్వాత బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి డిజాస్టర్స్ తర్వాత భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. మహేష్ బాబు కేవలం వెండితెరపైనే కాదు బుల్లితెరపై కూడా ఎన్నో యాడ్స్ లో నటిస్తున్నారు. పలు కంపెనీలకు ఆయన అంబాసిడర్ గా ఉన్నారు.
మహేష్ బాబు కేవలం చిత్రాలపైనే ఫోకస్ చేయకుండా బిజినెస్ రంగంలో కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే ఏఎంబీ సినిమాస్, హంబుల్ డ్రసెస్తో పాటు జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బేనర్లో పలు చిత్రాలు చేస్తున్నారు. తాజాగా ఆయన మరో కొత్త బిజినెస్ మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన మరో బిజినెస్ రంగంలోకి కూడా అడుగు పెడుతున్నట్లు సమాచారం అందుతుంది. పర్ఫ్యూమ్ బిజినెస్ విషయంపై మహేష్ కొద్ది రోజులుగా చర్చలు జరుపుతున్నారని ఇండస్ట్రీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు.. మహేష్ బాబు ఏ విషయం అయినా సోషల్ మీడియాలో వేదికగా చెబుతుంటారు.
ఈ వార్తలో ఎంత నిజముందనే విషయంపై త్వరలో క్లారిటీ రానుంది. మహేష్ బాబు త్వరలో వంశీ పైడిపల్లి లేదంటే పరశురాం దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. మరోవైపు చిరు 152వ చిత్రంలోను ముఖ్య పాత్ర పోషించనున్నట్టు ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఆయన వంశి పైడిపల్లితో ఓ చిత్రంలో నటించేందుకు అప్పట్లో కమిట్ అయినప్పటికీ వంశి తీసుకువెళ్లిన స్క్రిప్ట్ విషయంలో అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అయితే మరో కథతో సిద్దం అయ్యేందుకు వంశి పైడిపల్లి కసరత్తు మొదలు పెట్టారట. ఇక గీతాగోవిందం లాంటి సూపర్ హిట్ అందించిన పరుశరామ్ తోనే ఆయన మూవీ ఉండొచ్చు అని అంటున్నారు.