తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి పదేళ్ల తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150 చిత్రంలో రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే పదేళ్ల తర్వాత చిరు రీ ఎంట్రీ ఎలా ఉంటుందో అన్న ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు.  ఇందులో ద్విపాత్రాభినయం లో నటించి దుమ్మురేపాడు.  ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి మూవీలో నటించాడు చిరంజీవి.  తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ మూవీ దేవాలయాల్లో జరుగుతున్న అక్రమాలు వెలికితీసే పాత్రలో మెగాస్టార్ కనిపించబోతున్నారట. 

 

ఈ మూవీలో ఓ ఫ్లాష్ బ్యాక్ సీన్ దుమ్మురేపుతుందట. అయితే ఫ్లాష్ సీన్లో యువకుడి పాత్రలో మహేష్ బాబు అనుకున్నారట.. కానీ ఆయన రెమ్యూనరేషన్ విషయంలో తేడాల వచ్చినట్లు వార్తలు వచ్చాయి.  మొదట ఆ పాత్రలో రామ్ చరణ్ ని అనుకున్నారట.. కానీ రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీలో నటించడంతో ఆ పాత్రలో నటించలేని చెప్పారట.  అయితే మహేష్ బాబు క్యాన్సల్ కావడంతో మళ్లీ రంగంలోకి రామ్ చరణ్ ని దింపబోతున్నారట.  ఈ సినిమాలో చెర్రీ పాత్ర షాకింగ్‌గా ఉండబోతోందట. నక్సలైట్ పాత్రలో చెర్రీ కనిపించబోతున్నాడట.

 

ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఈ పాత్ర సినిమాను మలుపు తిప్పుతుందట. ఈ పాత్ర స్ఫూర్తితోనే ఆచార్య తన గమ్యాన్ని ఏర్పరచుకుంటాడట. సినిమాలో దాదాపు 30 నిమిషాలపాటు చెర్రీ క్యారెక్టర్ ఉంటుందట.  మెగాఫ్యాన్స్ కి పూనకాలే అంటున్నారు.  అంతే కాదు రామ్ చరణ్ కోసం ఓ పెద్ద ఫైట్ సీన్ క్రియేట్ చేశారట. అంతేకాకుండా చిరంజీవి, రామ్‌చరణ్ మీద ఓ పాటను కూడా చిత్రీకరించబోతున్నారట.  ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఒకే స్క్రీన్ పై చూడాలన్న అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి.  కొరటాల దర్శకత్వంలో చిరంజీవి చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: