జీ తెలుగు లో ప్రసారమయ్యే బొమ్మ అదిరింది షో కి బుల్లితెరపై  ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఎంతో నాచురల్ కామెడీతో టాప్ రేటింగ్  చేసుకుంటూ దూసుకుపోతుంది బొమ్మ అదిరింది షో. ముఖ్యంగా ఇక బొమ్మ  అదిరింది షోకి యాంకరింగ్  శ్రీముఖి వచ్చిన తర్వాత షోని  తన వాక్చాతుర్యంతో మరింత రక్తి కట్టిస్తుంది అనే చెప్పాలి. బొమ్మ అదిరింది షో నిర్వాహకులు సరికొత్తగా ఎప్పుడు కొత్త గెస్ట్ లను  పిలుస్తూ బుల్లితెర ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తున్నారు అనే విషయం తెలిసిందే.



 ఇక అదే సమయంలో ప్రస్తుతం జడ్జీగా ఉన్న నాగబాబు జానీ మాస్టర్ ఉన్న నవ్వులు  కూడా బొమ్మ  అదిరింది షోకి మరింత క్రేజ్ తెచ్చిపెడుతున్నాయి. ఇకపోతే అదిరింది షోలో భాగంగా ప్రతివారం సరికొత్త స్క్రిప్టుతో కమెడియన్స్ కడుపుబ్బ నవ్విస్తూ ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులను ఆకర్షిస్తూ తమ వైపు తిప్పుకున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతివారం కామెడీ డోస్  మరింత పెంచుతూ ఫుల్ టైం కామెడీ అందిస్తున్నారు. కాగా ఇటీవలే ఈ బొమ్మ అదిరింది కి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు. ఈ ప్రోమో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 ఇక ఈ ప్రోమోలో ప్రతి స్కిట్ కూడా ప్రస్తుతం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది అనే చెప్పాలి. ఇక ఫుల్ ఎపిసోడ్ చూస్తే మాత్రం బొమ్మ అదిరింది కాస్త అదిరిపోతుంది అని ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు  భావిస్తున్నారు. ఈ ప్రోమో లో భాగంగా ఎప్పటిలాగానే అన్ని  స్కిట్స్ బాగుండ గా ముఖ్యంగా సద్దాం హుస్సేన్ స్కిట్ జడ్జీలను కడుపుబ్బ నవ్వించడంతో పాటు ఈ ప్రోమో చూసిన ప్రేక్షకులను కూడా కడుపుబ్బ నవ్వించింది అని చెప్పారు. దీనికి సంబంధించిన ప్రోమో  బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ప్రస్తుతం అందరినీ ఆకర్షిస్తూ దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: