సమంత టాలీవుడ్ బ్యూటీ. సమంత తొలి చిత్రమైన ఏ మాయ చేసావే సినిమాతో 2010 లో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆపై తన నటించిన బృందావనం, దూకుడు, ఈగ,ఎటో వెళ్ళిపోయింది మనసు, చిత్రాలతో అతి తక్కువ సమయంలోనే తెలుగునాట ప్రముఖ కథానాయిక ఎదిగింది. ఒకేసారి ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ దక్షిణ భారత ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం ఒకేసారి ఒకే ఏడాది అందుకున్న నటిగా  కూడా సమంత ప్రసిద్ధి గాంచింది. తర్వాత వరుస విజయాలతో దూకుడు మీదున్న సమంతకు అనుకోని చేదు అనుభవం ఎదురైంది. ఇప్పుడు తెలుసుకుందాం.


 టాలీవుడ్ హీరోయిన్ వరుస విజయాలతో దూకుడు మీదున్న  సమంత కు అనుకోని చేదు అనుభవం ఎదురయింది. సమంత అక్కినేని ఆహా ఓటీటీ కోసం హుస్ట్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే కదా. సమంతా విషయానికి వస్తే ఓ వైపు సినిమాలు మరో వైపు ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న సమంత ఫుల్ బిజీగా ఉంది. అంతేకాదు పెళ్లి తర్వాత సమంత సక్సెస్ రేటు కూడా పెరిగింది. గతేడాది మామ నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కోసం వెళ్తే హౌస్ బాధ్యతలను తనపై వేసుకుని ఈ షోను తనదైన శైలిలో నడిపించి అనిపించింది.


 ఇప్పుడు ఆహా ఓటీటీ కోసం యాంకర్ అవతారం ఎత్తి తనదైన శైలిలో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి సామ్ జామ్ ప్రోగ్రామ్ కు వన్నె తెచ్చింది. ఎంతో ఆర్భాటంగా ఆహా ఓటీటీ లో ప్రసారమైన సామ్ జామ్ తొలి ట్రైలర్ విడుదల కాగానే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. ఈ షో ప్రారంభమైన తర్వాత ప్రేక్షకుల నుంచి సరైన స్పందన రావడం లేదు. దానికి ఓ రీజన్ ఉంది. ఈ ప్రోగ్రాం టీవీ చానల్స్ లో ప్రసారం కాకపోవడం ఒక కారణం.


 మరోవైపు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఓటీటీ గురించి ప్రజలకు పెద్దగా అవగాహన లేదు. కేవలం ఆహార ఓటీటీ వేదికలో ప్రచారం అవుతుండడంతో ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన లేదనే విషయం స్పష్టమవుతోంది. పైగా ఆహా ఓటీటీ లో సమంత ఇంటర్వ్యూ చేసే సెలబ్రెటీలు మెగా అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వాళ్లే ఎక్కువ ఉండటం దీనిపై నెగిటివ్ ఇంపాక్ట్ పడిందని కొంతమంది విశ్లేషిస్తున్నారు. కేవలం సినీ రంగంలో కొంతమంది ఫ్యామిలీ వాళ్ళు ఇందులో కనబడుతున్నారు అని గుసగుసలు వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: