సెలెబ్రెటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఎంతో ఇంట్రస్ట్ చూపిస్తారు అభిమానులు.వాళ్ళు సినీ తారలు కావచ్చు.. లేక క్రికెట్ కి సంబంధించిన సెలెబ్రిటీలు కావచ్చు. ఎవరైనా సెలెబ్రిటీలు చిన్నప్పటి నుంచే స్నేహితులని తెలిసినా.. కలిసే చదువుకున్నారని తెలిసినా ఆశ్చర్య పోతుంటారు.ఇప్పుడు కూడా అదే జరిగింది. టీమిండియా క్రికెటర్ ఎంఎస్‌ ధోనీ సతీమణి సాక్షి సింగ్‌, విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ చిన్నప్పటి నుంచే మిత్రులని తెలియడంతో నెటిజన్లు షాకయ్యారు.అనుష్క శర్మ, సాక్షి సింగ్‌ ధోనీ బాల్యం నుంచే స్నేహితులు.


వారిద్దరూ ఒకే పాఠశాలలో చదువుకున్నారు. వీరిద్దరూ పాఠశాల, కళాశాలలో తీసుకున్న చిత్రాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. అనుష్క శర్మ తండ్రి కర్నల్‌ అజయ్‌ కుమార్ శర్మ ఒకప్పుడు అస్సాంలో పనిచేశారు. అదే సమయంలో సాక్షి కుటుంబం సైతం అక్కడే ఉండేది. దాంతో వీరిద్దరూ సెయింట్‌ మేరిస్‌ పాఠశాలలో కలిసే చదువుకున్నారు. కలిసే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఎక్కువే.అనుష్క, సాక్షిది ఒకే బ్యాచ్‌. 1994 నుంచి కలిసే చదువుకున్నారు. ఆ తర్వాత అనుష్క బెంగళూరులోని మౌంట్‌ కార్మెల్‌ కళాశాలలో ఆర్ట్స్‌ చదివేందుకు వెళ్లింది.
 

సాక్షి హోటల్‌ మేనేజ్‌మెంట్ చేసింది. ఇక ధోనీ, కోహ్లీలతో ఎవరికి ఎలా పరిచయం అయిందో, ఆపై వివాహ బంధంతో ఎలా ఒక్కటయ్యారో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి చిత్రాలు వైరల్‌ మారాయి.ఇక చాలామందికి ఈ విషయం తెలియక పోవడం అనేది గమనార్హం అనే చెప్పాలి.అయితే కాల్ 2013 వ సంవత్సరంలోనే ఓ ముఖాముఖిలో విరాట్ భార్య అనుష్క శర్మ వీరిద్దరి స్నేహం గురించి, ఒకే బడిలో చదువుకున్న విషయమూ చెప్పడం జరిగింది..మరోవైపు విరాట్ కోహ్లీ సైతం ధోని కూతురుతో సరదాగా ఆడుకుంటున్న వీడియో కూడా నెట్టింట్లో వైరల్ అయిన విషయం తెలిసిందే ఇక ప్రస్తుతం వీరిద్దరూ కలిసి దిగిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: