టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఒకదాని వెంట మరొకటి సక్సెస్ లతో అపజయం ఎరుగని దర్శకులుగా దూసుకెళ్తున్న వారిలో కొరటాల శివ కూడా ఒకరు. మొదట కథకుడిగా పలు సక్సెస్ఫుల్ సినిమాలకు అద్భుతమైన స్టోరీ లు అందించిన కొరటాల ఆ తరువాత యువి క్రియేషన్స్ బ్యానర్ పై ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమాతో తొలిసారిగా దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. అనుష్క శెట్టి, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా 2013లో విడుదలై సూపర్ హిట్ కొట్టింది.
ఆ తరువాత సూపర్ స్టార్ మహేష్ తో శ్రీమంతుడు మూవీ తీసి పెద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన కొరటాల, అనంతరం ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, అలానే మరొక్కసారి మహేష్ తో భరత్ అనే నేను వంటి రెండు సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో ఆచార్య మూవీ చేస్తున్నారు కొరటాల. ఇక ఇండస్ట్రీ లోని దాదాపుగా అందరు స్టార్ హీరోలతో కొరటాల కు మంచి అనుబంధం ఉంది. త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కొరటాల ఒక భారీ పాన్ ఇండియా మూవీ చేయనున్న విషయం తెల్సిందే. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు దీనిని నిర్మించనున్నాయి.
కాగా నేడు కొరటాల శివ బర్త్ డే కావడంతో అనేకమంది సినీ ప్రేక్షకులు టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆయనకు బర్త్ డే విషెస్ తెలియచేస్తుండగా కొద్దిసేపటి క్రితం తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కొరటాలకు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు ఎన్టీఆర్. 'స్నేహానికి విలువనిచ్చే వ్యక్తిత్వం అరుదు, అటువంటి అరుదైన స్నేహితుడు, సన్నిహితుడు కొరటాల శివ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ గా చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది ..... !!

 

మరింత సమాచారం తెలుసుకోండి: