మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఆచార్య సినిమా విడుదల కు సిద్ధంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి కాగా ప్రస్తుతం ఫినిషింగ్ పనులను చేసుకుంటుందట. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రామ్చరణ్ పూజాహెగ్డే లు కీలక పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకి హైలైట్ కానుందని అంటున్నారు.ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి రెండు రీమేక్ లు, ఓ డైరెక్ట్ తెలుగు సినిమా సంగతి అందరికీ తెలిసిందే.

మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాలను రీమేక్ చేస్తుండగా మలయాళ సూపర్ హిట్ సినిమా లుసిఫర్ ను మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ యంగ్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఓ డైరెక్ట్ తెలుగు సినిమా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనుంది. ఇలా వరుస సినిమాలతో దుమ్మురేపుతున్న మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమాతో ఎంత పెద్ద హిట్ కొడతాడు అని ఆయన అభిమానులు ఈ సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు . 

అన్ని సినిమాలు ఒక ఎత్తు అయితే మెహర్ రమేష్ తో చేయబోయే వేదళం మాత్రం అందరిలో ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ట్రాక్ రికార్డ్ అంత బాగా లేని మెహర్ రమేష్ కు మెగాస్టార్ చిరంజీవి ఛాన్స్ ఇవ్వడం అందరికీ ఆశ్చర్యం తో పాటు కలవరాన్ని కూడా కలిగించింది. ఒక ఫ్లాప్ డైరెక్టర్ కు మెగాస్టార్ చిరంజీవి అవకాశం ఎలా ఇచ్చాడు అన్న సందేహం నెలకొన్న నేపథ్యంలో ఒకే ఒక కారణం వల్ల ఆయనకు ఈ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. అదే ఈ సినిమా బడ్జెట్.  25 నుంచి 30 కోట్ల మధ్యలోనే సినిమాని పూర్తి చేస్తానని మెహర్ రమేష్ చిరంజీవికి హామీ ఇవ్వడంతో ఆయనకు సినిమా అవకాశం ఇచ్చారట చిరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: