విక్టరీ
వెంకటేష్ హీరోగా తెరకెక్కిన
నారప్ప చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా దానితో భారీ హిట్ ను సొంతం చేసుకున్నాడు వెంకీ. ఆ తర్వాత ఆయన నటించిన దృశ్యం2
సినిమా కూడా తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయగా
దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. మరొకవైపు ఇదే సమయంలో భారీ చిత్రాలు విడుదల కాబోతు ఉండడంతో వెనక్కితగ్గే ఆలోచన కూడా చేస్తుంది.
తాజాగా
బాలకృష్ణ నటించిన అఖండ
సినిమా చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో
దసరా కి రాకపోవడం తో ఈ సినిమాను
దసరా కి విడుదల చేయాలనే ఆలోచన చేస్తోంది చిత్రబృందం. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన ప్రమోషన్ పనులను కూడా మొదలు పెట్టింది. ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ను
సెప్టెంబర్ 20వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన ఇచ్చింది చిత్రబృందం. ఈ
సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టిదని దసరాకు తప్పకుండా ఈ
సినిమా విడుదల అవుతుందని
వెంకీ అభిమానులు చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం విడుదల తేదీ ని ఎప్పుడు ప్రకటిస్తుండో చూడాలి.
ఇక
వెంకటేష్ ఈ సినిమాతో పాటే
అనిల్ రావిపూడి దర్శకత్వం లో
f3 సినిమాను కూడా చేస్తున్నాడు. ఇటీవలే ఆఖరి షెడ్యూల్ చిత్రం మొదలయ్యింది.
వరుణ్ తేజ్ మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా,
మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ చిత్రంపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ
సినిమా సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఏదేమైనా రెండు పండగ సీజన్లలో
వెంకటేష్ తన
సినిమా విడుదలకు ప్లాన్ చేస్తు ఉండడం ఎంతో సంతోషానికి గురిచేస్తుంది. మరి ఈ రెండు సినిమాలు
వెంకటేష్ కు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి. నారప్పా తర్వాత ఈ రెండు సినిమాలతో కూడా హిట్ సంపాదించి హ్యాట్రిక్ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు వెంకటేష్.