నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ మేనియా మొదలైందని చెప్పాలి. నందమూరి అభిమానులు ఎంతో ఆకలితో ఎదురుచూస్తున్న సినిమా అఖండ. ఇటీవలే తొలి పాటను విడుదల చేసుకొని యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది ఈ పాట. అంతేకాదు ఇప్పటికే విడుదలైన రెండు టీజర్ లను సూపర్ హిట్ చేసి సినిమాపై క్రేజ్ ను భారీగా పెంచారు ప్రేక్షకులు. ఇప్పుడు కూడా అదే విధంగా పాటను ఆకాశానికి ఎత్తేస్తూ సినిమాపై అంచనాలను భారీగా పెంచారు నందమూరి అభిమానులు.

ఇదిలా ఉంటే బాలకృష్ణ మేనియా టాలీవుడ్ లో మొదలైందని ఇప్పుడు ఈ సినిమా కు ఉన్న క్రేజ్ ను బట్టి చెప్పాలి. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలవడంతో ఒక్కసారిగా నందమూరి అభిమానులలో ఎక్కడలేని సంతోషం నెలకొంది. దసరా కి సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తూ ఉండడం తో ఈ చిత్రంలోని పాటలను విడుదల చేయడానికి రంగం సిద్దం చేసుకోగా ఇప్పుడు పాటను విడుదల చేసింది మరికొన్ని రోజుల్లోనే మరో పాటను ఆ తర్వాత ట్రైలర్ ను విడుదల చేసి చిత్రం పై మరిన్ని అంచనాలు పెంచే విధంగా ఆలోచనలు చేస్తుంది చిత్రబృందం.

నందమూరి బాలకృష్ణ రెండు డిఫరెంట్ రోల్స్ లో నటించిన ఈ సినిమా లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా విలన్ గా శ్రీకాంత్ నటిస్తుండటం విశేషం. బాలయ్య, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కావడంతో ఈ చిత్రంపై హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ దర్శక హీరోలు. తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుండగా నేపధ్య సంగీతం ఇంకా ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మిరియాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: