మెగా మేనల్లుడు
సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ అనే సినిమాను
అక్టోబర్ ఒకటో తేదీన విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ప్రస్థానం తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు దేవాకట్టా దర్శకత్వం వహించాడు. దురదృష్టవశాత్తు ఈ
సినిమా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురికావడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలులేకుండా పోయింది.
కానీ ఈ
సినిమా కోసం
హీరో లేకపోతే ఏంటి స్టార్ హీరోలు అయిన సాయి ధరంతేజ్ మేనమామలు తరలివస్తున్నారు. ఇప్పటికే
మెగాస్టార్ చిరంజీవి సినిమా ట్రైలర్ ను విడుద ల చేసి మోరల్ సపోర్ట్ ఇవ్వగా పవన్
కళ్యాణ్ ఈ
సినిమా ప్రీ రిలీజ్
ఈవెంట్ కు హాజరై
సినిమా విజయానికి నాంది పలుకుతున్నారు. ఇప్పటికే ట్రైలర్ ద్వారా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పరచుకున్న ఈ
సినిమా సినిమా పరం గా కూడా ప్రేక్షకులను బాగానే అలరిస్తుందని తెలుస్తుంది.
మణిశర్మ సంగీతం సమకూర్చగా ఈ
సినిమా ఇంత త్వరగా హడావుడి గా విడుదల అవుతుంది అని ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే ఈ
సినిమా విడుదల కావడంపై ప్రేక్షకులు కొంత ఆశ్చర్యం వ్యక్త పరుస్తున్నా రు.
మెగాస్టార్ పవర్ స్టార్ అండదండ ఈ సినిమాకు మంచి బూస్ట్ ఇస్తుంది అని చెబుతున్నారు. మరి మొదటి దశ
కరోనా పూర్తయిన తర్వాత
సోలో బ్రతుకే సో బెటర్ అనే
సినిమా ద్వారా హిట్ సంపాదించిన
సాయి ధరమ్ తేజ్ ఈ సారి తీసిన ఈ రిపబ్లిక్
సినిమా తో ఏ రేంజ్ లో హిట్ సంపాదించుకుంటాడో చూడాలి. ఇకపోతే ఈ
సినిమా ప్రీ రిలీజ్
ఈవెంట్ ఈనెల 25వ తేదీన జె ఆర్ సి కన్వెన్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరగనుంది.