మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ అనే సినిమాను అక్టోబర్ ఒకటో తేదీన విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ప్రస్థానం తో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు దేవాకట్టా దర్శకత్వం వహించాడు. దురదృష్టవశాత్తు ఈ సినిమా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురికావడంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలులేకుండా పోయింది.

కానీ ఈ సినిమా కోసం హీరో లేకపోతే ఏంటి స్టార్ హీరోలు అయిన సాయి ధరంతేజ్ మేనమామలు తరలివస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సినిమా ట్రైలర్ ను విడుద ల చేసి మోరల్ సపోర్ట్ ఇవ్వగా పవన్ కళ్యాణ్సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరై సినిమా విజయానికి నాంది పలుకుతున్నారు. ఇప్పటికే ట్రైలర్ ద్వారా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పరచుకున్న ఈ సినిమా సినిమా పరం గా కూడా ప్రేక్షకులను బాగానే అలరిస్తుందని తెలుస్తుంది. 

మణిశర్మ సంగీతం సమకూర్చగా ఈ సినిమా ఇంత త్వరగా హడావుడి గా విడుదల అవుతుంది అని  ఎలాంటి ప్రమోషన్స్ లేకుండానే ఈ సినిమా విడుదల కావడంపై ప్రేక్షకులు కొంత ఆశ్చర్యం వ్యక్త పరుస్తున్నా రు. మెగాస్టార్ పవర్ స్టార్ అండదండ ఈ సినిమాకు మంచి బూస్ట్ ఇస్తుంది అని చెబుతున్నారు. మరి మొదటి దశ కరోనా పూర్తయిన తర్వాత సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా ద్వారా హిట్ సంపాదించిన సాయి ధరమ్ తేజ్ ఈ సారి తీసిన ఈ రిపబ్లిక్ సినిమా తో ఏ రేంజ్ లో హిట్ సంపాదించుకుంటాడో చూడాలి. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 25వ తేదీన జె ఆర్ సి కన్వెన్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: