అలాంటి గుర్తింపు ను దక్కించుకున్నాడు హీరో తనీష్. ముఖ్యంగా యువతను బాగా ఆకట్టుకున్నాడు. అయితే అనూహ్యంగా ఈ హీరో ఇండస్ట్రీలో కనుమరుగై పోవడం తన అభిమానులను ఎంతగానో బాధించింది. సినిమాలు చేస్తున్నా వరుస ఫ్లాపులు చుట్టుముట్టడంతో ఈ హీరోకి అవకాశాలు కరువయ్యాయి. ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 లో ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక అక్కడ తనీష్ చేసిన సందడి అంతా ఇంతా కాదు. దీప్తి సునైన మనోడు దాదాపు డీప్ లవ్ లోకి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ లో ది బెస్ట్ పులిహోర రాజా అంటూ అప్పట్లో నెటిజన్లు ట్రోల్స్ కూడా చేశాడు. బిగ్ బాస్ తర్వాత అవకాశాలు వస్తాయి మళ్లీ బిజీ హీరోగా మారి పోతాడు అని అందరూ అనుకున్నారు కానీ అలా ఏమి జరగలేదు. ఆశించిన స్థాయిలో అయితే అవకాశాలు దక్కలేదు.
తాజాగా ఈ హీరో నటించిన "మరో ప్రస్థానం" మూవీ రిలీజ్ కాగా అది మిశ్రమ స్పందన అందుకుంటోంది. ఈ మధ్య డ్రగ్స్ కేసులో తనీష్ చిక్కుకున్నాడు అంటూ..అతడికి కోర్టు నుండి నోటీసులు వచ్చాయని...సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలపై స్పందించిన తనీష్ తనకు ఆ డ్రగ్స్ కేస్ కు ఎటువంటి సంబంధం లేదని...తనకు కోర్టు నుండి నోటీసులు వచ్చిన మాట నిజమే. కానీ అసలు విషయం ఏంటంటే బెంగళూర్ లో ఒక ప్రొడ్యూసర్ పైన కేసు నమోదు అయ్యింది...దాంతో నిజానిజాలు తెలుసుకోవడానికి ఆధారాల కోసం అతని కాంటాక్ట్ అయిన వారికందరికీ నోటీసులు పంపినట్లు తెలిసింది. మళ్ళీ మునుపటిలాగే తనీష్ ఇండస్ట్రీలో హీరోగా అలరిస్తాడా చూడాలి.