మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొంద వలసిన ఓ సినిమా ఇప్పుడు విజయ్ దేవరకొండ చేయబోతూ ఉండడం ఒక్కసారిగా టాలీవుడ్ సినిమా పరిశ్రమను ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పాలి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న రామ్ చరణ్ ఆ తరువాత సినిమాను గౌతమ్ తిన్ననూరితో చేయవలసి ఉంది. కానీ ఆ సినిమా క్యాన్సల్ అయినట్లుగా ఇప్పుడు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో వార్తలు వినిపిస్తున్నాయి.

జెర్సీ లాంటి జాతీయ అవార్డు విన్నింగ్ సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ ను ఈ సినిమాతో ఒప్పించినా కూడా కొన్ని కారణాలవల్ల ఆ సినిమాను రిజెక్ట్ చేశాడు రామ్ చరణ్. అందుకే ఈ కథను వేరే హీరోకి ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది. యూత్ లో భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న హీరో అయిన విజయ్ దేవరకొండకు ఈ కథను చెప్పి ఆయనతో సినిమాను దాదాపుగా ఓకే చెప్పినట్లుగా తెలుస్తుంది. ఫ్యూచర్ లో జరిగిన కొన్ని పరిణామాల దృష్ట్యా రూపొందించిన ఈ కథ తప్పకుండా తనకు మంచి విజయాన్ని తెచ్చిపెడుతుంది అన్న నమ్మకంతోనే విజయ్ దేవరకొండ ఈ సినిమాను చేశాడని చెప్పవచ్చు.

త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతుంది. ఇప్పటికే లైగర్ సినిమా పరాజయం పొందడంతో ఆ సినిమాకు సంబంధించిన డిసప్పాయింట్మెంట్ ను తొలగించుకోవాలి అంటే తప్పకుండా ఒక భారీ విజయాన్ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విజయ్ దేవరకొండ ఆ చిత్రాన్ని పూర్తిచేసిన తరువాత గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.ప్రస్తుతానికైతే అయన పూర్తి దృష్టి ఇప్పుడుఒకే సినిమాపైనే ఉంది. అదే ఖుషి. ఈ సినిమా కి అయన భారీ సక్సెస్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: