నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన వీర సింహారెడ్డి సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై మంచి విజయాన్ని అందుకుంది ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా కూడా భారీగా రాబట్టడంతో మరొకసారి తన హవా చూపించారు బాలయ్య. ఈ సినిమా ఈనెల 23వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కాబోతోంది. దీంతోపాటు అన్ని భాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ ని డిస్ని సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రాంతీయ బాష చిత్రాలకు ఇండియా వైడ్ గా ప్రేక్షకులు ఉండడంతో డిజిటల్ సంస్థలు అన్నీ కూడా సినిమాలను డబ్ చేసి విడుదల చేస్తున్నారు.


ఇందులో భాగంగానే ఇప్పటికే హిందీ సినిమాలు తెలుగులో డబ్ చేయడం జరుగుతోంది. అలాగే తమిళ్, మలయాళం వంటి సినిమాలను కూడా తెలుగు వర్షన్లు ఓటీటి లో స్ట్రిమింగ్ అవుతూ ఉన్నాయి. ఇదంతా ఇప్పుడు ఇలా ఉండగా వీరసింహారెడ్డి సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా డబ్ చేసి స్ట్రిమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ ,శృతిహాసన్ మలయాళ స్టార్ హీరోయిన్ ఉండడంతో అన్ని భాషలలో కూడా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

కంటెంట్ పరంగా కూడా మాస్ ఆడియన్స్ ని కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమా ఉండడంతో.. తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం.. ఇతర భాషలలో ఓటీటి లో విడుదలైన ఈ చిత్రం ఏవిధంగా ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి మరి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారికి థియేటర్ రైట్స్ తో పాటు డిజిటల్ రైట్స్ లో కూడా మంచి లాభాలను పొందుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా బాలయ్య వీర సింహారెడ్డి తో పాన్ ఇండియా హీరోగా రావాలని చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: