
ఇక భర్తతో వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న ఈమెకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు చాలా వైరల్ గా మారుతుంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈమె విడాకుల తీసుకోబోతోంది అంటూ వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయాలు ఇలా వైరల్ అవ్వడానికి కూడా కారణం లేకపోలేదు. ఆమె తన సోషల్ మీడియా ఖాతా నుండి తన భర్తకు సంబంధించిన ఫోటోలన్నింటినీ కూడా డిలీట్ చేసింది దీనితో విడాకులు తీసుకోబోతున్న అన్న సందేహం అందరిలో కలిగింది. అయితే ఈ విషయం గురించి ఎన్నో రకాలుగా వార్తలు వస్తుండడంతో తాజాగా ఆమె ఖండించే ప్రయత్నం చేసింది.
ప్రస్తుతం ఈమె నటుడు నవీన్ చంద్ర తో కలిసి మంత్ ఆఫ్ మధు అనే సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది . తాజాగా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరపగా అందులో చిత్ర బృందం మీడియా ప్రతినిధులతో సమావేశమై వారు అడిగే ప్రశ్నలకు సమాధానాన్ని వెల్లడించారు. ఈ క్రమంలోనే ఒక విలేఖరి విడాకుల ప్రస్తావన తీసుకురాగా... ఈ కార్యక్రమానికి ఈ ప్రశ్నకు ఏ మాత్రం సంబంధం లేదు అని నేను అనుకుంటున్నాను అందుకే ఈ ప్రశ్నకు నేను సమాధానం అస్సలు చెప్పను అంటూ తెలివిగా సమాధానం చెప్పి దాటవేసింది కలర్స్ స్వాతి.