టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'ఫ్యామిలీ స్టార్'. ఇప్పుడు ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఏప్రిల్ 5న ఈ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.రీసెంట్‌గా విడుదలైన ఈ ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సైతం మెస్మరైజ్ చేశాయి. డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ లో మరోసారి ఫ్యామిలీ మ్యాన్‏గా తనదైన నటనతో అలరించేందుకు రెడీ అయ్యాడు విజయ్ దేవరకొండ. అలాగే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‏గా దూసుకుపోతున్న మృణాల్.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మరికొన్ని రోజుల్లో ఈ విడుదల కాబోతుండడంతో ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. మరోవైపు ఫ్యామిలీ స్టార్ మూవీ టీంకు సినీ సెలబ్రెటీస్, అభిమానులు అందరూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఈ క్రమంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా విజయ్ దేవరకొండకు శుభాకాంక్షలు తెలిపింది. ఆల్ ది బెస్ట్ డార్లింగ్స్' అంటూ విష్ చేసింది.' నా డార్లింగ్స్ విజయ్ దేవరకొండ, పరశురామ్ పెట్ల (దర్శకుడు)లకు శుభాకాంక్షలు. ఏప్రిల్ 5న విడుదల కానుంది. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అందుకే నాకు పార్టీ కావాలి. మై లవ్ మృణాల్‌ ఆల్ ది ' అంటూ రాసుకొచ్చింది. రష్మిక  కు విజయ్ దేవరకొండ క్యూటెస్ట్ అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరి షేర్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. గతంలో పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా కలిసి నటించిన చిత్రం గీతా గోవిందం. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ మూవీ సమయం నుంచే విజయ్, రష్మిక మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అలాగే చాలాసార్లు వీరిద్దరు ఒకరి కు మరొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక ఇటీవల విడుదలైన 'ఫ్యామిలీ స్టార్' ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చూడాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. విజయ్ దేవరకొండ చివరిగా 'ఖుషి' లో నటించాడు. ఇందులో సమంతతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోగా.. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు.తిరుపతిలో జరిగిన ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ పాల్గొన్నారు. ''స్వామివారి దర్శనం కోసం ఇప్పటికే చాలాసార్లు తిరుపతి వచ్చా. ఈ ప్రాంతం నుంచి మా సినిమా ప్రమోషన్స్‌ మొదలు పెట్టడం ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీస్సులు మన అందరికీ ఉండాలని కోరుకుంటున్నా. పరశురామ్‌తో ఇప్పటికే 'గీత గోవిందం' చేశా. దానిని మించి ఈ సినిమా ఉండనుంది. యాక్షన్‌, ఎమోషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌.. ఇలా అన్నీ ఉన్న మంచి మూవీతో మీ ముందుకు వస్తున్నాం. ఈ వేసవి సెలవుల్లో మీరు తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు. రిలీజ్‌ తర్వాత మీ అందరినీ కలుస్తా'' అని అన్నారు.'లైగర్‌' పరాజయం తర్వాత హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు విజయ్‌ దేవరకొండ. ఆయన నటించిన గత చిత్రం 'ఖుషి' మిశ్రమ స్పందనలకే పరిమితమైంది. దీంతో ఆయన ఆశలన్నీ 'ఫ్యామిలీ స్టార్‌'పైనే పెట్టుకున్నారు. ఇందులో విజయ్‌ మధ్య తరగతి వ్యక్తిగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌ రాజు నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: