రెబల్ స్టార్ ప్రభాస్ కొన్ని సంవత్సరాల క్రితం మిస్టర్ ఫర్ఫెక్ట్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , తాప్సి హీరోయిన్గా నటించగా ... దశరథ్ ఈ సినిమాకు దసకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించగా ... దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ 2011 వ సంవత్సరం ఏప్రిల్ 21 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో 14 సంవత్సరాలు పూర్తి అయింది. ఈ సినిమా విడుదల అయ్యి 14 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ మూవీ కి ఆ సమయంలో ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి ..? ఎన్ని పొట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 8.78 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 4.42 కోట్లు , ఉత్తరాంధ్రలో 3.12 కోట్లు , ఈస్ట్ లో 1.82 కోట్లు , వెస్ట్ లో 1.78 కోట్లు , గుంటూరులో 2.28 కోట్లు , కృష్ణ లో 1.63 కోట్లు , నెల్లూరులో 1.07 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 24.09 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ కి రెస్ట్ ఆఫ్ ఇండియా లో 2.50 కోట్లు , ఓవర్సీస్ లో 1.33 కోట్లు కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 27.29 కోట్ల కనెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 27.92 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. దానితో ఏ మూవీ ద్వారా బయ్యర్లకు దాదాపు 7.92 కోట్ల లాభాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: