ప్రజెంట్ పవన్ కళ్యాణ్ పేరు ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఒకే ఒక్క దెబ్బతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉండే పెద్దల నోర్లు  మూత పడేలా చేసాడు.  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సినిమాని అడ్డుకోవాలని చూసిన పెద్ద మనుషులకు పెద్దరికంగానే దెబ్బ కొట్టాడు . పవర్ స్టార్ పవన్ చేసిన ఒకే ఒక్క పోస్ట్ టాలీవుడ్ నిర్మాతల గుండెల్లో రైలు పరిగెత్తించేలా చేసింది . ఇప్పుడు అందరు ఆ తప్పు సరి  చేసుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు.  కాగా ఇలాంటి మూమెంట్లోనే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన మరొక న్యూస్ ఇంట్రెస్టింగ్ గా మారింది . పవన్ కళ్యాణ్ గతంలో నందమూరి బాలకృష్ణ హోస్టు గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన విషయం అందరికీ తెలిసిందే .


ఈ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను మొత్తం బయటపెట్టేసాడు పవన్ కళ్యాణ్. చాలా చాలా నిజాయితీగా హుందాగా తన మూడు పెళ్లిల గురించి కూడా బయట పెట్టేశాడు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ కి ఉన్న ఒక వ్యాధి గురించి కూడా బయటపడింది . అప్పటివరకు పవన్ కళ్యాణ్ కి అలాంటి ఒక వ్యాధి ఉంది అన్న సంగతి ఎవరికీ తెలియదు . పవన్ కళ్యాణ్ కి ఆరు , ఏడవ తరగతిలో ఉన్నప్పుడే ఆస్తమా , జ్వరం వంటి అనారోగ్య సమస్యలతో బాగా ఇబ్బంది పడేవారట . ఆ సమయంలో బయటకు వెళ్లి ఆడుకోలేక నలుగురితో కలవలేక ఫ్రెండ్షిప్ అనేది ఎవరితో చేయలేక పుస్తకాలతోనే ఫ్రెండ్షిప్ చేశారట .



పుస్తకాలను ఫ్రెండ్స్ గా మార్చుకున్నారట . అంతేకాదు తన స్నేహితులందరూ ఎప్పుడు ఆటలలో ముందుకు వెళుతూ ఉంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతి సారీ ఆటలు ఆడుతూ ఫెయిల్ అయిపోతూ ఉండేవారట.  అసలు స్కూల్ కి వెళ్ళాలి అంటేనే ఇష్టం ఉండేది కాదట . ఏ విషయాన్ని కూడా ఎవరికీ చెప్పకుండా ఎవ్వరు చెప్పకుండానే సొంతంగా నేర్చుకోవడాని అలవాటు చేసుకున్నాడట . అదే మూమెంట్ లో 17 ఏళ్ళ వయసులో మానసికంగా చాలా డిస్టర్బ్ అయ్యారట . ఒకానొక సందర్భంలో సూసైడ్ కూడా చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారట.  ఓ రోజు ఆ డిప్రెషన్ తట్టుకోలేక అన్నయ్య చిరంజీవి గన్  తీసుకొని కాల్చుకోవడానికి సిద్ధమయ్యాడట . అది చూసిన వదిన సురేఖ పవన్ కళ్యాణ్ చేతిలో నుంచి గన్ లాగి ఈ పిచ్చి పని ఏంటి అంటూ కోపడుతూ వెంటనే ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పి చిరంజీవి దగ్గరికి తీసుకువెళ్తే నువ్వు చదవకపోయినా పర్వాలేదు బ్రతికుంటే చాలు అంటూ చెప్పారట . ఈ విషయాలన్నీ స్వయాన పవన్ కళ్యాణ్ నే బయట పెట్టడం సంచలనంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: