"స్నేహగీతం" అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు . ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో హీరోగా హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో ఇంకో సక్సెస్ అందుకుని.. టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోగా కొనసాగుతూ వచ్చాడు . తెలుగు - తమిళం - హిందీ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు . అయితే హీరోగా అనుకున్నంత స్థాయి రిచ్ కాలేకపోయినా సందీప్ ..బిజినెస్ ప్రకారం మాత్రం వేరే లెవెల్లో దున్నేస్తున్నాడు . వచ్చిన కొద్ది డబ్బులనే బిజినెస్ లల్లో పెట్టుబడులుగా పెట్టి దాని ద్వారా లాభాలు అందుకుంటున్న సందీప్ కిషన్ .."వివాహ భోజనంబు" అనే పేరిట ఒక రెస్టారెంట్ ప్రారంభించారు .
అది సూపర్ సక్సెస్ అయింది . ఇప్పుడు హైదరాబాద్ అంతటా బ్రాంచెస్ ఓపెన్ చేసి ఫుల్ లాభాలను అందుకుంటున్నాడు సందీప్ కిషన్ . అంతే కాదు ఇప్పుడు తాజాగా మరొక బిజినెస్ ని కూడా ప్రారంభించాడు . సెల్యూట్ వ్యాపారం లోకి ఎంట్రీ ఇచ్చాడు సందీప్ కిషన్ . విజయవాడలో ఎక్స్ప్రెస్ అనే పేరుతో సెలూన్ ప్రారంభించాడు . అక్కడ సక్సెస్ అయితే మాత్రం రాజమండ్రి - విజయవాడ - కాకినాడ - వైజాగ్ లాంటి ప్రధాన నగరాలలో కూడా సందీప్ ఈ సెల్యూన్ ని ఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నాడట . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు సందీప్ కిషన్ బిజినెస్ ద్వారానే కోట్లకు కోట్లు సంపాదించేస్తున్నాడు అన్న కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి . ప్రస్తుతం సినిమాల్లో కన్నా కూడా రెస్టారెంట్ బిజినెస్ ద్వారానే ఎక్కువగా సంపాదిస్తున్నాడు సందీప్ కిషన్ అంటూ తెగ వార్తలు వినిపించేస్తున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి