మహేష్ రాజమౌళి సినిమా షూటింగ్ మొదలై నెలలు గడుస్తున్న కనీసం .. ఈ సినిమా పూజా కార్యక్రమం ఫోటోలు కూడా ఎక్కడ బయటికి ఇవ్వకుండా రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు .. అయినా ఏదో ఒక రూపంలో లీకులు బయటకి వస్తూనే ఉన్నాయి .. పృథ్విరాజ్ సుకుమారన్ ఉన్న విషయం ఆయనకు ఆయన చెప్పలేదు కానీ బయటికి వచ్చేసింది .. అలాగే నాన్న పటేకర్ , విక్రమ్ నో చెప్పింది .. మాధవన్ ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తున్నాడు అంటూ వార్తలు ఏదో ఒక రూపంలో బయటికి వస్తూనే ఉన్నాయి .  ఇదే క్ర‌మంలో ప్రియాంక చోప్రా ఈ సినిమాలో ఉన్న విషయం కూడా జక్కన్న అధికారికంగా బయట పెట్టలేదు . అయితే ఇప్పుడు అభిమానులకి మరింత  గూస్ బంప్స్ ఇచ్చే టాక్ ఒకటి ఇప్పుడు ఎంట్రీ ఇచ్చింది ..


ఈ భారీ పాన్ వరల్డ్ మూవీ అడవి నేపథ్యంలో జరిగే స్టోరీ అని అందరికీ తెలిసిందే.   అలాగే ఇండియానా జోన్స్ స్పూర్తితో కథను తయారు చేశామని రచయిత విజయేంద్ర ప్రసాద్ ఆ మధ్య పలు ఇంటర్వ్యూలో చెప్పటం గుర్తుండే ఉంటుంది.   అయితే ఇప్పుడు తాజాగా బయటికి వచ్చిన లీక్ ఏమిటంటే దీనికి రామాయణంకి  ముడిపెట్టారట .  అది ఎలా అంటే మేరు పర్వతం గుర్తుందిగా .  ఇంద్రజిత్ వేసిన బాణానికి లక్ష్మణుడికి ప్రాణపాయం కలిగితే తనను బ్రతికించడానికి సంజీవిని మూలికలు కావాలని సూసేన వైద్యుడు చెబుతాడు .. దాంతో అవి తాగడానికి వెళ్లిన హనుమంతుడు వాటిని గుర్తించలేక మొత్తం పర్వతాన్ని ఎత్తుకు వచ్చి లక్ష్మణున్ని కాపాడుతాడు ..



ఇక ఇప్పుడు సంజీవిని మూలికలే మహేష్ , రాజమౌళి మూవీలో కీలక ట్విస్ట్ కి కారణం అవుతాయట .. అలాగే మహేష్ వాటిని తెచ్చేందుకు అడవిలోకి వెళ్లే ఎపిసోడ్ రాజమౌళి ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని ఇన్ సైడ్ వర్గాల టాక్ .. ఇది నిజమో కాదో కానీ వింటేనే మంచి హైప్‌ వచ్చేస్తుంది .  అసలు ఎవరు ఊహించని అల్లూరి సీతారామరాజు , కొమరం భీం కాంబో ని సాధ్యం చేసిన రాజమౌళి ఇప్పుడు సంజీవని ఫారెస్ట్ అడ్వెంచర్లు చూపించడం పెద్ద విషయం కాదు .. త్వరలోనే ఆఫ్రికా వెళ్లబోతున్న మహేష్ , రాజమౌళి టీం అక్కడ కూడా ఎన్నో కీలకమైన సన్నివేశాలని తెర్కెక్కిస్తారు .. 2027 చివరలో ఈ సినిమాను విడలు చేసే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: