
ఈ సినిమాకి సంబంధించి ఒక పాట మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ ఉందట. మిగతాదంతా కంప్లీట్ అయిపోయిందట. ఈ పాట షూట్ కోసం ముంబై చేరుకున్నాడు ఎన్టీఆర్ . అయితే ఇక్కడే ఎన్టీఆర్ అభిమానులకి మరో గుడ్ న్యూస్ అందించినట్లైంది. ఎన్టీఆర్ చేతిలో "Muruga: The Lord of war, The god of Wisdom’ (మురుగ: ద లార్డ్ ఆఫ్ వార్, ద గార్డ్ ఆఫ్ విస్డమ్) అనే పుస్తకం కనిపించింది. ఇంకేముంది అభిమానులకి ఇది పండుగ అని చెప్పాలి .
త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో అల్లు అర్జున్ కాంబినేషన్ లో లాక్ అయిన ప్రాజెక్ట్ ఇది. అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి అల్లు అర్జున్ తప్పుకున్నాడు అని.. ఆ ప్లేస్ లోకి ఎన్టీఆర్ వచ్చాడు అని ఇన్నాళ్లు సిని వర్గాలలో వార్తలు వినిపించాయి . దాన్ని కన్ఫామ్ చేసేస్తూ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లో బుక్ పట్టుకొని ఉండడంతో అభిమానులకిఓ రేంజ్ గుడ్ న్యూస్ అందించినట్లు అయింది . ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు కాంబినేషన్లో కార్తికేయ స్వామికి సంబంధించిన కథతో ఓ సినిమా తెరకెక్కబోతున్నట్లుగా ఇప్పుడు జనాలు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు .
ఆల్రెడీ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ కన్ఫర్మ్ చేశాడు. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సైతం కన్ఫామ్ చేసినట్లయింది. ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తి చేసేసాడు త్రివిక్రమ్ . వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి చేశాక ఎన్టీఆర్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది . ఈ లోపు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు - వెంకటేష్ తో ఒక సినిమాని కంప్లీట్ చేసేస్తాడట. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో తెరకెక్కే సినిమా కోసమే ఆ బుక్ చదువుతున్నాడు ఎన్టీఆర్ అని ఆ కారణంగానే చేతిలో ఆ బుక్ ఉందని సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అవుతున్నారు ఫ్యాన్స్. మొత్తానికి కార్తికేయుడి రూపంలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు ఇది నిజంగా నిజంగా వేరే లెవల్ అంటూ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు..!!