ధనియాలు పేరు వినని వారుండరు. అనేక రకాల పదార్ధాల తయారీలో ధనియాలను బాగా ఉపయోగిస్తారు. అయితే దీనిని కేవలం వంటింటి పోపుదినుసుగా మాత్రమే కాకుండా ధనియాలను ఒక ఔషధంగా వినియోగిస్తే వీటి వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని లేటెస్ట్ అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. లేటెస్ట్ పరిశోధనల ప్రకారం ధనియాలు వల్ల గ్యాస్ నుంచి ఉపశమనం కలుగుతుందని అదేవిధంగా శరీరాన్ని చల్ల బరిచే ప్రక్రియలో ధనియాల సహాయం ఎక్కువగా ఉంటుందని చెపుతున్నారు.
ముఖ్యంగా హైపోగ్లైసీమిక్గా ధనియాలు పనిచేసి రక్తంలో గ్లూకోజ్ ని తగ్గించే విధంగా పనిచేస్తాయని చెపుతున్నారు. దీనితో ధనియాలు ప్రకృతి ప్రాసాధించిన వరంగా పరిగణిస్తున్నారు. ధనియాల్లో అనేక పోషకాలున్నాయి. అందువల్ల అనేక అనారోగ్య సమస్యలకు కూడ పరిష్కారంగా ఈ ధనియాలు పనిచేస్తాయి. ధనియాల కషాయం తాగడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది. జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం, విరోచనాలకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది.
ప్రకృతిపరంగా లభించిన ధనియాలలో అనేక వైద్యపరమైన లక్షణాలు కలిగి ఉండటం వల్ల సహజ రూపంలో మనం తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చని అనేక పరిశోధనలు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మధుమేహం రాకుండా నిరోధించడానికి అదేవిధంగా మధుమేహ వ్యాధిని నయం చేయడానికి ఈధనియాలు ఎంతగానో సహకరిస్తాయని లేటెస్ట్ అధ్యయనాలు చెపుతున్నాయి.
పసుపులో ధనియాల పొడి లేదా రసాన్ని కలిపి మొటిమలపై రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి. ధనియాల కషాయాన్ని తాగితే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంటువ్యాధులకు కారణం అయ్యే సూక్మక్రిములతో పోరాడే గుణాలు ధనియాల్లో ఉంటాయి. ధనియాలను తీసుకోవడం వల్ల వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్ మన శరీరానికి అందడంతో మన శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు కూడ అభిప్రాయపడుతున్నారు..