టాలీవుడ్లో ఇద్దరు అమ్మాయిలు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన
భామ క్యాథరిన్ థెరిస్సా. బన్సీ సరసన సరైనోడు చిత్రంలో ఎమ్మెల్యే పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైంది, నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా కి వ్యతిరేకంగా ఓ మీడియాలో జర్నలిస్ట్ పాత్రలో ఆకట్టుకుంది ఈ భామ. ఇంకా పైసా చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ తన నటనతో ప్రేక్షకులకు దగ్గరైన క్యాథరిన్ థెరిస్సా కొంతకాలంగా తమిళ చిత్రసీమకే పరిమితమైంది. ఇటీవలె విడుదలైన వదలడు సిద్ధార్ధతో కలిసి నటించిన చిత్రం విడుదలై మంచి విజయాన్ని సాధించింది. అందులో తనకు ముక్కు పని చెయ్యని పాత్రలో నటించి ఆకట్టుకుంది. కొంతకాలం గ్యాప్ తీసుకున్న తర్వాత తెలుగులో
విజయ్ దేవరకొండ సరసన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో మళ్లీ వస్తోంది. ఎంతో ప్రతిభావంతురాలైన నటిగా గుర్తింపు తెచ్చుకున్నక్యాథరిన్ ఓ అరుదైన వ్యాధితో బాధపడుతోందట. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పడం గమనార్హం.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు అనోస్మియా అనే వ్యాధి ఉందని తెలిపింది. అనోస్మియా బాధితులు ఎలాంటి వాసనలు ఆఘ్రాణించలేరు. వారు మంచి వాసనలే కాదు, చెడు వాసనలు కూడా గుర్తించలేరు. వాసనలు గుర్తించే శక్తి వారిలో శూన్యం అని చెప్పాలి. ఈ జబ్బు కారణంగా పెళ్లి చేసుకోకూడదని భావిస్తున్నాననే పాత్రలో ఈ హీరోయిన్ నటించి మెప్పించింది. మాటల మాంత్రికుడు
త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ చిత్రం
పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీని తమిళంలోకి రీమేక్ చేస్తున్నారు..
పవన్ కళ్యాణ్ పాత్రలో శింబు, సమంత పాత్రలో మేఘా
ఆకాష్, నదియా పాత్రలో ఖష్బూ నటిస్తున్నారు.. తాజాగా ప్రణిత పాత్ర కోసం క్యాథరిన్ థెరిస్సాను తీసుకున్నారు.. కాగా మూవీ తొలి షెడ్యూల్ జార్జియాలో ప్రారంభమైంది..
సుందర్ సి దర్వకత్వం వహిస్తున్న ఈ మూవీని లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు..త్వరలోనే హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం కానుంది..