ఫిల్మ్ ఇండస్ట్రీలో సిల్వర్ స్క్రీన్ కు పరిచయం అవుతున్నప్పుడు ఆ ప్రాజెక్ట్ కి ఏదో ఒక క్రేజ్ ఉండాలి. లేదంటే ఏదైనా మేజిక్ కాంబినేషన్ అయినా ఉండాలి. ఆ విధంగానే టాలీవుడ్ కి ఎంట్రి ఇస్తున్న ఓ స్టార్ ప్రొడ్యూజర్ కొడుకు మూవీ ఎంట్రిలో జరుగుతున్న జిమ్మిక్కులు చూస్తుంటే టాలీవుడ్ ను ఆశ్ఛర్యపరుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఎపిహెరాల్డ్.కామ్ ప్రత్యేకంగా మీకు అందిస్తుంది. బెల్లంకొండ సురేష్ తనయుడు శ్రీనివాస్ ఈ సంవత్సరం టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రి ఇవ్వబోతున్నాడు. ఇందులో హీరోయిన్ గా సమంత నటిస్తుంది. ప్రస్తుతం సమంత తెలుగు, తమిళ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. అయితే ఆ క్రేజ్ నే క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు నిర్మాత బెల్లంకొండ సురేష్. తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ కి హీరోగా పెద్దగా ఇమేజ్ లేదు కాబట్టి తను నిర్మిస్తున్న సినిమాలో సమంత హీరోయిన్ గా తీసుకున్న కారణం కూడా ఇదే. తనయుడికి ఎలాగూ స్టార్ డం లేదు కాబట్టి ఆ క్రేజ్ ను సమంత ద్వారా తీసుకురావాలని సురేష్ భావిస్తున్నాడని తెలుస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ ఇటలీ షెడ్యూల్ ను ముంగించుకొని వచ్చింది. ఇప్పటికే చాలా ఖర్చు పెట్టిన ఈ సినిమా కోసం బెల్లంకొండ సురేష్ పెడుతున్న డబ్బులన్నీ సమంతను చూసే అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ క్రేజ్ లేని కొత్త హీరో పై, కేవలం హీరోయిన్ ను చూసి పెట్టే బడ్జెట్ ఎంత వరకు రికవరీ అవుతుందనేది ఎవరికీ తెలియదు. కానీ ఆ డబ్బునంతా సమంతతో పాటు దర్శకుడు వివివినాయక్ లు రాబడతారనే నమ్మకంతోనూ ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదట. మరి బెల్లంకొండ నమ్ముతున్న ఫార్ముల సక్సెస్ అయిందంటే కొడుకు ఎంట్రి సూపర్ సక్సెస్ అయినట్టే. లేకుంటే ఆ బాధను ఎవ్వరకి చెప్పుకోలేక కామ్ గా ఉండిపోవటమే అని టాలీవుడ్ అంటుంది. బెల్లంకొండ సురేష్ కష్టానికి ఫలితం లభిస్తుందా? లేదా? ఈ టాపిక్ పై మీ కామెంట్స్ ను ఇక్కడ పోస్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: