టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కు తెలంగాణ కన్నా ఎన్నికలే ముఖ్యమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు విమర్శించారు. ఎన్నికలతో తెలంగాణ వస్తే ఇక ఉద్యమాలు ఎందుకని ఆయన గురువారమిక్కడ ప్రశ్నించారు. కేసీఆర్ లో భిన్న వాదనలు వినిస్తున్నాయని రాఘవులు అన్నారు. ఎన్నికలే ప్రధానమో ఎన్నికల ద్వారానే వస్తుందని టీఆర్ఎస్ అభిప్రాయమో లేక టీజాక్ అభిప్రాయమో వారందరి అభిప్రాయమో కాని ఈ అభిప్రాయం అంత స్పష్టంగా లేదన్నారు. ఎన్నికల ద్వారానే తెలంగాణ వస్తుందని అనుకుంటే ఉద్యమాలే అవసరం లేదన్నారు. ఉద్యమాల ద్వారానే తెలంగాణ వస్తుందని అనుకుంటే ఎన్నికల గురించి మాట్లాడల్సిన అవసరం లేదని ఆయన కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: