ప్రభుత్వం లింగ నిర్థారణ పరీక్షలను నిషేధించి, కఠిన చట్టాన్ని అమలు చేస్తున్నా ధన పిపాసులు దానిని నిర్భయంగా ఉల్లంఘిస్తూనే ఉన్నారు. నేటికీ సమాజంలో ఆడ పిల్లల విషయంలో కొంత మంది ఆలోచనలు మారకపోవడం ఇలాంటి దోపిడీ దారులకు వరంగా మారుతోంది. అందరూ కలిసి కడుపులోనే శిశువులను అంతం చేసేస్తున్నారు. ఇలాగే లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ, గర్భ స్రావాలు, భ్రూణ హత్యలకు పాల్పడుతున్న వరంగల్ జిల్లాలోని తేజస్విని ఆస్పత్రిలో ఆడపిల్లలని స్కానింగ్‌లో తేలితే ఆస్పత్రి         వైద్యులు అబార్షన్‌కు యత్నిస్తున్నారు.   ఓ మహిళ కడుపులోని  7 నెలల బేబిని అబార్షన్‌కు యత్నిస్తుండగా సమాచారం తెలిసుకున్న వరంగల్ డీఎమ్‌హెచ్ఓ అధికారులు అక్కడకు చేరుకుని బ్రూణ హత్యలకు పాల్పడుతున్న ఆస్పత్రి స్కానింగ్ విభాగాన్ని  సీజ్ చేశారు. డాక్టర్‌ను పోలలీసులు అదుపులోనికి తీసుకున్నారు. దీనిపై ఐద్వా తోపాటు పలు మహిళ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐద్వా మహిళ నాయకులు,  కార్యకర్తలు  మాట్లాడుతూ  గ్రామీణ ప్రాంత అమాయక మహిళలను చేసి ఆడపిల్లలని తెలిస్తే అబార్షన్ లకు పాల్పడుతున్న వైద్యులను అరెస్టు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుని ఇలాంటి సంఘటనలు పుణరావృత్తం కాకుండా చూడాలిని ప్రభుత్వాన్ని వారు కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: