జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణా పర్యటన మీద సీరియస్ అవుతూనే తనదైన శైలి లో తిప్పి కొట్టారు కెసిఆర్. అమిత్ షా నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా తేరాట్పల్లి గ్రామంలో దళితవాడలో పర్యటించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అయితే అమిత్ షా తిన్న భోజనం దళితవాడల్లో వండిందికాదని సీఎం కేసీఆర్ తెలిపారు. పక్కనే ఉన్న ఖమ్మంగూడెం గ్రామంలో మనోహర్రెడ్డి అనే వ్యక్తి వండించి పంపించిన భోజనం అని కేసీఆర్ చెప్పారు.


తాజా సర్వే ప్రకారం బీజేపీకి తెలంగాణలో ఒక్క సీటు కూడా రాదని సీఎం వెల్లడించారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఎన్ని మాట్లాడినా ఇప్పటికీ తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే గౌరవమని కేంద్రంతో రాజ్యాంగపరమైన సంబంధాలు కొనసాగుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. నోట్ల రద్దు సందర్భంగా దేశంలో ఏ సీఎం కూడా మద్దతు చెప్పలేదని ప్రధాని మోడీకి సపోర్ట్ చేసిన ఏకైక సీఎం తెలంగాణ తానేనని కేసీఆర్ గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: